భారత వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ కుబేరుల జాబితాలో 4స్థానం సంపాదించారు.
బ్లూమ్ బెర్గ్ బిల్లినియర్స్ ఇండెక్స్ ప్రకారం నిర్వహించిన సర్వేలో ఈ విషయం బయటపడింది. గతంలో ప్రపంచ కుబేరులు టాప్ 5 స్థానాలలో అమెరికా దేశానికి చెందిన వాళ్లు మరియు యూరోపియన్ కంట్రీస్ కి చెందిన వాళ్ళు లేదా మెక్సికన్ కి చెందిన వాళ్లు మాత్రమే ఆధిపత్యం కొనసాగించేవారు.
అయితే ఈసారి టాప్ ఫైవ్ స్థానాలలో ఒక భారతీయుడు చోటు దక్కించుకోవడం విశేషం. ముకేశ్ అంబానీ ఈ స్థానాన్ని దక్కించుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. మెయిన్ కారణం చూస్తే కరోనా కష్టకాలంలో మార్చిలో రిలయన్స్ షేర్ లు 145% ఎదిగి 867.82 కనిష్టంగా ఉండటంతో…. ఆయిల్ మార్కెట్ దెబ్బతిన్నప్పటికీ రిలయన్స్ డిజిటల్ విభాగంలో భారీ పెట్టుబడులు సంపాదించడంతో రికార్డు స్థాయిలో షేర్లు రాబట్టారు. దీంతో ప్రపంచ కుబేరుల్లో నాలుగో స్థానంలోకి ముఖేష్ అంబానీ నిలిచారు.