(హైదరాబాద్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
భారీ వర్షాలు, వరదలకు హైదరాబాద్ అతలాకుతలం అయ్యింది. కాలనీలకు కాలనీలు ముంపునకు గురి అయ్యాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది. వందేళ్ల హైదరాబాద్ చరిత్రలో ఇంత భారీగా వరద రావడం ఇది రెండవ సారి అన్నది అందరికీ తెలిసిందే,. ప్రజలు తీవ్రంగా నష్టం పోయి ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంత వరకూ నగరంలో పర్యటించిన దాఖలాలు లేవు, టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం నగరంలో పర్యటించారు. దీనితో కేసిఆర్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. ట్విట్టర్ వేదికగా సీఎం కేసిఆర్ ను విమర్శించారు.
రాష్ట్రంలో భారీ వర్షాలకు ప్రజలు నష్టపోతుంటే సీఎం కేసిఆర్ ఎక్కడున్నారని సీతక్క ప్రశ్నించారు. ప్రగతి భవన్ నుండి బయటకు వచ్చి ఏ ఒక్క గ్రామాన్ని, కాలనీని ఎందుకు సందర్శించలేదని నిలదీశారు సీతక్క. పెద్ద సంఖ్యలో రైతాంగం పంటలు నష్టపోయారు, కొంత మంది ఆత్మీయులను కోల్పోయి ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం కేసిఆర్ కు గుణపాఠం చెబుతుంది ఎదురుచూస్తూ ఉండాలని సీతక్క ట్వీట్ చేశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?