కొత్త రకం కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది ఇంగ్లాండ్ దేశంలో మొట్టమొదటి సారి బయటపడ్డ ఈ వైరస్ ఎన్నో దేశాలను కలవర పెడుతోంది. ఇక వ్యాక్సిన్ రేపో మాపో భారత్ లోనికి కూడా ప్రవేశిస్తుంది. ఒక మూడు నెలల్లో అందరూ టీకాలు వేయించుకుంటారు అని అనుకుంటున్న తరుణంలో ఇది ఒక పెద్ద షాక్ అనే చెప్పాలి..
ఇప్పటిది కాదు….
ఇక ఈ కొత్తరకం కరోనా వైరస్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) లో చీఫ్ సైంటిస్ట్ అయిన డాక్టర్ సౌమ్య స్వామినాథన్ ఒక పిడుగు లాంటి వార్త చెప్పారు. ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సౌమ్య స్వామినాథన్ కరోనా వైరస్ ఇప్పటికే ఎన్నో దేశాల్లో ప్రవేశించి ఉంటుందని చెప్పడం గమనార్హం. బ్రిటన్ లో అన్ని కేసులు నమోదు అవుతున్నాయి అంటే కచ్చితంగా బయట దేశాలకు ఇది ఎప్పుడో వెళ్లి ఉంటుందని… అయితే బయటపడేందుకు సమయం పడుతుంది అన్నట్లు ఆమె వ్యాఖ్యానించారు.
ఇలా అయితే మేలే ….
అయితే ఇలాంటి సమయంలో కూడా ఆమె ఒక మంచి వార్త చెప్పడం జరిగింది. ప్రస్తుతం తయారుచేయబడుతున్న కోవిడ్ వ్యాక్సిన్ లు ఈ కొత్తరకం వైరస్ కంట్రోల్ చేయగలరు అని భావిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇక ఈ కొత్తరకం వైరస్ ఇప్పుడు వచ్చిన వ్యాక్సిన్ లకు అంతుచిక్కని విధంగా అయితే లేనట్లు తమ దృష్టికి వచ్చిందని ఆమె అన్నారు. అయితే ఒకపక్క ఏమో దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తుంది అన్నట్టు మాట్లాడుతూ మరొక పక్క టీకాల తో నయం అయిపోతుంది అని చెబుతున్న సౌమ్య స్వామినాథన్ మాటలు ఎన్నో సందేహాలకు దారితీశాయి.
డబ్ల్యూహెచ్వో కి మాత్రం తిట్లు తప్పలేదు…
ఇక చీఫ్ సైంటిస్ట్ మాటలతో ప్రతి ఒక్కరూ ప్రపంచ ఆరోగ్య సంస్థ మీద విరుచుకు పడుతున్నారు. ఈ వైరస్ను ఆదిలోనే తుంచి వేయకుండా చైనా కు సపోర్ట్ గా వ్యవహరిస్తూ ఇంతదూరం తీసుకొని వచ్చారని మండిపడుతున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఈ వైరస్ అన్ని దేశాలలో పాకింది కానీ టీకాతో నయం చేయవచ్చు అని కబుర్లు చెబుతున్నారని…. విపరీతంగా తిట్టిపోస్తున్నారు. మొత్తానికి ప్రస్తుతానికైతే మరీ ఎక్కువ దేశాలు ఈ కొత్త వైరస్ కేసుల గురించి బయటకు వెల్లడించలేదు కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి.