Nagababu: జనసేన పార్టీలో నాగబాబు కీలకంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో జాయిన్ అయిన నాగబాబు ఆ సమయంలో నరసాపురం నియోజకవర్గం నుండి పార్లమెంట్ కు పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం కొద్ది గ్యాప్ ఇచ్చిన నాగబాబు ఇటీవల మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అవుతూ వస్తున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
పవన్ కళ్యాణ్ సమావేశాలకు అదేవిధంగా రైతులను పరామర్శించే కార్యక్రమాలలో నాగబాబు పాల్గొనడం జరిగింది. ఇదిలా ఉంటే ఇటీవల కొద్ది రోజుల క్రితం ఉత్తరాంధ్రలో నాగబాబు జనసేన పార్టీ తరఫున పర్యటన చేయబోతున్నట్లు పార్టీ ప్రకటించడం తెలిసిందే. ఉత్తరాంధ్రలో పార్టీని బలోపేతం చేసే దిశగా.. జనసేన పార్టీ ఈ కార్యక్రమం నిర్వహించడానికి రెడీ అవుతూ ఉంది. ఇటువంటి తరుణంలో తాజాగా మీడియా సమావేశం నిర్వహించిన నాగబాబు.. పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తులకు సంబంధించి పవన్ నిర్ణయమే తుది నిర్ణయం అని చెప్పుకొచ్చారు.
ఇక ఇదే సమయంలో చిరంజీవి పొలిటికల్ కెరియర్ గురించి మాట్లాడుతూ… ఆయనకి సినిమాలంటే ఆసక్తి అని పేర్కొన్నారు. అదేవిధంగా చిరంజీవి మద్దతు జనసేన పార్టీకి ఉంటుందని తెలిపారు. జనసేన పార్టీకి మద్దతు తెలిపనివారు మెగా ఫ్యాన్ కాదు అని చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వం పై నిరంతరం పోరాటం చేస్తామని ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు, వెనకడుగు వేసేది లేదని విజయనగరం జనసేన పార్టీ నాయకుల సమావేశంలో మీడియాతో నాగబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర వలసల కట్టడికి పవన్ దగ్గర స్పష్టమైన ప్రణాళిక ఉందని నాగబాబు చెప్పుకొచ్చారు.