ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. రాహుల్ గాంధీని అదేవిధంగా ప్రియాంక గాంధీ ఢిల్లీలో ప్రత్యేకంగా కలిసి ఏపీలో టిడిపి చాప్టర్ క్లోజ్ అయినట్లు, అదే రీతిలో పరిపాలనలో వైసిపి ఫెయిల్ అయిందని తెలిపారట. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఇదే సరైన టైం పుంజుకోవడానికి అంటూ కొన్ని ప్లానింగ్ లు అధిష్టానానికి కిరణ్ కుమార్ రెడ్డి వివరించారట. కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిన ప్లాన్స్ అన్ని హైకమాండ్ కి నచ్చడంతో ప్రొసీడ్ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.
అయితే ఈ క్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి కొన్ని కండిషన్లు పెట్టినట్లు సమాచారం. అది ఏమిటంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు అందరితో హైకమాండ్ ప్రత్యేకంగా పిలిపించి సమావేశం నిర్వహించాలని కోరారు. ఇప్పటికే టీడీపీ– వైసీపీ లోకి వెళ్ళిన కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ప్రస్తుతం టచ్ లో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. వాళ్ళందరిని కలిపి వంద మంది ఉంటారని, ప్రస్తుతం అధికారంలో ఉన్నవారే అని తెలిపారట. వీళ్లంతా ఎప్పటికప్పుడు టచ్ లో ఉన్నట్లు రిపోర్టు హైకమాండ్ కి కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చారట.
అంతేకాకుండా ఏపీకి ప్రత్యేకహోదా అనేది కాంగ్రెస్ ఇచ్చిన హామీ అని రాష్ట్ర ప్రజలోకి బలంగా తీసుకెళ్లాలని అనుకుంటున్నారట. అందులో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని, అదేవిధంగా టీడీపీ – వైసీపీ హోదా తీసుకురావడంలో ఫెయిల్ అయినట్లు ప్రజలకు అర్ధమయ్యే రీతిలో తెలపాలని డిసైడ్ అయ్యారు. రాష్ట్రా రాజధాని, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కీలకమైన పనులకి నిధులు బీజేపీ ఇవ్వలేదని….వీటన్నింటిపై కాంగ్రెస్ పార్టీ సమగ్ర వంతంగా పోరాడితే రాష్ట్రంలో భవిష్యత్ ఉంటుందని పెద్ద స్కెచ్ కిరణ్ కుమార్ రెడ్డి వేసినట్లు సమాచారం.
ఇదంతా విన్న కాంగ్రెస్ హైకమాండ్ అంతా ఓకే అని, దీనికి కావలసిన రూట్ మ్యాప్ తయారు చేయండి అని కిరణ్ కుమార్ రెడ్డికి తెలిపారట. ప్రస్తుతం ఈ వార్త ఏపీ మీడియా వర్గాల్లో వైరల్ గా మారింది. గతంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేశాక కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి బయటకి వచ్చి “సమైక్యాంధ్ర” పార్టీ పెడితే 2014 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన కిరణ్ కుమార్ రెడ్డి తాజాగా కాంగ్రెస్ పార్టీతో మళ్లీ చేతులు కలపడం, తిరిగి ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉనికిని తీసుకురావటం కోసం పావులు కదపడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.