హైదరాబాద్: ఖమ్మం మాజీ ఎంపి నామా నాగేశ్వరరావు టిఆర్ఎస్లో చేరారు. గురువారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసిన నామా గులాబీ కండువా కప్పుకున్నారు.
నామాతో పాటు టిడిపికి చెందిన నేతలు కూడా గులాబీ పార్టీ గూటికి చేరారు. నేతలందరికీ కేటిఆర్ టిఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ను బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని నామా ఈ సందర్భంగా తెలియజేసారు. కార్యకర్తలందరిని కలుపుకు పోతామని నామా పేర్కొన్నారు.
ఖమ్మం ఎంపి అభ్యర్థిగా కాసేపట్లో నామా పేరును ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?