అమరావతి: వైఎస్ జగన్మోహనరెడ్డి మంత్రివర్గంలో శనివారం ప్రమాణ స్వీకారం చేసిన 25మందిలో ముగ్గురు నానీలు ఉన్నారు.
ఏలూరు శాసనసభ్యుడు ఆళ్ల కాశీకృష్ణ శ్రీనివాస్, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య ఈరోజు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే వారిని అదే పేర్లతో పిలిస్తే చాలామందికి వారెవరో తెలియదు. కొడాలి నానీ, ఆళ్ల నానీ, పేర్ని నానీ అంటేనే వారెవరో తెలుస్తుంది. ఈ నానీ పేరుతో ఆ ముగ్గురూ అంత సుప్రసిద్ధులు. వారి అసలు పేర్లు చాలా మందికి తెలియదు. వారిని బంధువులు, సహచరులు, స్నేహితులు ‘నాని’ గానే సంభోదిస్తుంటారు.
ఆళ్ల నాని, కొడాలి నాని, పేర్ని నానిలు (నాని త్రయం) శనివారం ప్రమాణ స్వీకారంలోనూ వారి అసలు పేరుతో పాటు ‘నాని’ అని చెప్పుకుని ప్రమాణం చేయడం గమనార్హం.