అమరావతి: ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవికి టిడిపి మహిళా నేత నన్నపనేని రాజకుమారి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్కి బుధవారం అందచేశారు. అనంతరం నన్నపనేని మాట్లాడుతూ ప్రభుత్వం మారినందున నైతిక బాధ్యతగా రాజీనామా చేసినట్లు తెలిపారు. మూడేళ్ల వార్షిక నివేదికను గవర్నర్కు అందచేసినట్లు చెప్పారు. నివేదికపై తనను గవర్నర్ ప్రశంసించారని ఆమె తెలిపారు. మూడేళ్ల నివేదిక సిద్ధం చేసేందుకే ఇప్పటి వరకూ రాజీనామా చేయకుండా ఆగానని నన్నపనేని చెప్పారు. తన హయాంలో బాధిత మహిళలకు అన్ని రకాలుగా అండగా నిలిచానని రాజకుమారి తెలిపారు. వసతి గృహాల్లో భద్రత పెంచాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. రాష్ట్రంలో కుటుంబ వ్యవస్థను పటిష్టపరచాలని నన్నపనేని ప్రభుత్వాన్ని కోరారు.
previous post
next post