Nara Lokesh: నారా లోకేశ్ Nara Lokesh ఈమధ్య పొలిటికల్ పంచ్ లు ఎక్కువగా ఇస్తున్నారు. మాటల్లో దూకుడు పెంచుతున్నారు. ప్రత్యర్ధులపై విరుచుకుపడుతున్నారు. ఏపీ సీఎంను జగన్ రెడ్డి అని వేలు చూపించి మరీ హెచ్చరిస్తున్నారు. ‘పీకాడు.. పీకారు..’ అనే మాస్ డైలాగులు వేస్తున్నారు. మొత్తానికి తన ఉనికిని తానే చాటుకుంటున్నారు. అయితే.. ఏపీ ప్రభుత్వం చేపట్టిన పనులు, నిర్ణయాలపై లోకేశ్ ప్రభుత్వంపై సెటైర్లు.. సీఎంకు వార్నింగ్ లు ఇస్తున్నారు. మా డిమాండ్ కు ఒప్పుకోకపోతే ఎంత దూరమైనా వెళ్తామంటున్నారు. కానీ.. ఆ మాటపై లోకేశ్ స్పందన ఉండటం లేదు. అమరావతి రైతుల ఉద్యమం, టీడీపీ కార్యకర్తలపై దాడులు, పది పరీక్షల నేపథ్యంలో ఆయన ఘాటు డైలాగులైతే వేశారు కానీ.. వాటిపై నిలబడరా? అనేదే ప్రశ్న.
ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో అతి ముఖ్యమైనది రాజధాని తరలింపు. దీనిని ఆ ప్రాంత రైతులే కాదు.. స్వతహాగా టీడీపీ కూడా వ్యతిరేకించింది. యువ నాయకుడిగా వారి తరపున ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నది తక్కువే. కేవలం ప్రభుత్వ నిర్ణయాన్ని మీడియా ముందు వ్యతిరేకించడమే చేశారు. యువ నాయకుడిగా ఆయన ఆ ప్రాంతంలో రైతులకు మద్దతుగా దీక్ష చేపట్టి ఉంటే ఉద్యమం మరో స్థాయిలో ఉండేదే. కానీ.. అలా జరగలేదు. కార్యకర్తలపై దాడులు జరగితే పరామర్శిస్తున్నారు.. జగన్ రెడ్డీ.. అంటూ వేలు చూపించి మరీ హెచ్చరించారు. కానీ.. నాయకుల అరెస్టు సమయంలో మాత్రం పెదవి విప్పడం లేదు. రీసెంట్ గా పది పరీక్షలు జరిపితే ఊరుకోనని తీవ్ర స్థాయిలో స్పందించారు.
కానీ.. సీఎం జగన్ ఆ పరిక్షల విషయంలో ముందుకే వెళ్తున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు నిర్వహిస్తున్నామంటున్నారు. జగన్ నిర్ణయం ముందు వరకూ హోరెత్తిన లోకేశ్.. సీఎం ప్రకటన తర్వాత మాత్రం మీడియా ముందే కనబడలేదు. పది పరీక్షల విషయంలో స్పందించలేదు. ఘాటు హెచ్చరికలు, కౌంటర్లు లేవు. ఇది టీడీపీ శ్రేణుల్లో, కార్యకర్తల్లో, ప్రజల్లో కూడా సరైన సంకేతాలివ్వదనే చెప్పాలి. మీడియా, ప్రజల అటెన్షన్ కోసం చేసిన వ్యాఖ్యల్లా లోకేశ్ మాటలు ఉండిపోయాయని చెప్పాలి. భవిష్యత్ నాయకుడిగా ఎదగాలంటే.. ఇటువంటి విషయాలపై ప్రకటనలు, హెచ్చరికలు చేసినంత దూకుడుగానే ఉండాలి. మరి.. లోకేశ్ ఏం చేస్తారో..?
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?