అమరావతి: మహిళా అధికారిణిని బెదిరించిన కేసులో వైసిపి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రెండు గంటల్లో బెయిల్పై బయటకు రావడాన్ని టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ తప్పుబట్టారు. ట్విట్టర్ వేదికగా జగన్ ప్రభుత్వ చర్యలను విమర్శించారు.
తనకు ప్రాణహాని ఉందని ఒక మహిళా ఎంపిడిఒ అర్థరాత్రి వేళ ఫిర్యాదు చేయడానికి వెళితే కేసు నమోదు చేయడానికి ఎనిమిది గంటలు వెనుకాడిన పోలీసులు అందుకు కారణమైన వైసిపి ఎమ్మెల్యేకు మాత్రం స్టేషన్లో రాచమర్యాదలు చేసి, నామమాత్ర కేసులు పెట్టి రెండు గంటల్లోనే బెయిల్పై విడుదల చేశారని అన్నారు.
స్త్రీ శక్తికి సంకేతంగా జరుపుకునే దసరా ఉత్సవాల వేళ, విధి నిర్వహణలో నిజాయితీగా ఉన్న ఒక మహిళా అధికారిణికి జగన్ ప్రభుత్వం చేసిన అన్యాయమిది అని లోకేష్ వ్యాఖ్యానించారు.