అమరావతి: రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు సంక్రాంతి పండగకు దూరంగా ఉంటే సీఎం జగన్ మాత్రం వేడుకలు చేసుకుంటున్నారని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ విమర్శించారు. అమరావతిలో ఆంక్షలు విధించారని, పొలాలకు ముళ్ల కంచెలు వేశారని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ‘అమరావతి ప్రాంతంలో యుద్ధ వాతావరణం తీసుకొచ్చి, జగన్ గారు మాత్రం పండుగ చేసుకుంటున్నారు. ప్రజలు సంతోషంగా ఉండకూడదా? పొలాల్లో ముళ్ల కంచెలు వేస్తారా?’ అని ప్రశ్నించారు.
‘ అమరావతి గ్రామాలను పాకిస్థాన్ బోర్డర్ ని తలపించే విధంగా మార్చేశారు. ఎంత దారుణం? వైసీపీ ప్రభుత్వం రైతులను టెర్రరిస్టుల్లా చూస్తోంది. ముళ్ల కంచెలు, పోలీసు లాఠీలతో దమనకాండ ఆపాలి’ అని లోకేష్ డిమాండ్ చేశారు.
అమరావతి గ్రామాలను పాకిస్తాన్ బోర్డర్ ని తలపించే విధంగా మార్చేసారు. ఎంత దారుణం? వైకాపా ప్రభుత్వం రైతులను టెర్రరిస్టుల్లా చూస్తోంది. ముళ్ల కంచెలు, పోలీసు లాఠీలతో దమనకాండ ఆపాలి.(2/2)#SaveAmaravati #MyCapitalAmaravati
— Lokesh Nara (@naralokesh) January 14, 2020
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?