ఢిల్లీ, జనవరి 10: ప్రధాని నరేంద్ర మోదితో గురువారం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ భేటీ అయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ రకాల అంశాలపై చర్చించినట్లు సమాచారం. గవర్నర్ నరసింహన్ రెండు రోజుల క్రితం ప్రధాన మంత్రి మోదీని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరగా పిఎంఒ నుండి అనుమతి రావడంతో బుధవారం రాత్రి ఢిల్లీ వచ్చారు. పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాధ్ సింగ్ను కూడా కలుసుకోనున్నట్లు సమాచారం.
previous post
next post