తెలంగాణ రాష్ట్రంలో కుండపోత వర్షాలు వలన వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాదులో అయితే చాలా వరకు ప్రాంతాల్లో నీళ్లు నడుము లోతు రావడంతో…ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవగా…కొన్ని చోట్ల ఇల్లు కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి తరుణంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ సహాయ సహకార కార్యక్రమాలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందేలా చూసుకుంటున్న సంగతి తెలిసిందే.
హైదరాబాదులో కురుస్తున్న వర్షాలకు ప్రజలు పడుతున్న బాధలకు దేశంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, సినీ రాజకీయ సెలబ్రిటీలు విరాళాలు ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో మాజీ గవర్నర్ నరసింహన్ కూడా తన వంతుగా తన సేవింగ్స్ లో దాచుకున్న 25 వేల రూపాయలను తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళంగా ప్రకటించారు. ప్రస్తుతం సొంత రాష్ట్రం తమిళనాడులోని చెన్నైలో కుటుంబంతో నరసింహన్ కలిసి ఉంటున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి కేసీఆర్…. నరసింహాన్ ఎంతో ప్రాధాన్యత ఇస్తూ… కోరిందల్లా తక్షణమే అమలులోకి వచ్చేలా వ్యవహరించేవారు.
వీరిద్దరి మధ్య మంచి స్నేహ బంధం ఉంది అని చాలామంది చెబుతారు. అందువల్లే నరసింహన్ వీడ్కోలు కార్యక్రమంలో కేసీఆర్ కొంత కన్నీటిపర్యంతమయ్యారు అని కూడా అంటారు. కాగా ఫ్రెండ్ ప్రభుత్వం ప్రస్తుతం కుండపోత వర్షాల కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో పాతిక వేల రూపాయలు విరాళంగా ప్రకటించి… వరద బాధితులను ఆదుకోని విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పనులను కొనియాడుతూ మాజీ గవర్నర్ నరసింహన్ ప్రశంసించారు.