తెలుగు మీడియా రంగంలో పేరొందిన ఎన్టీవీ, టీవీ ఫైవ్ ఛానల్ యాజమాన్యాల మధ్య గొడవలు హీట్ పుట్టిస్తున్నాయి. ఎన్ టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి, టీవీ 5 చైర్మన్ బిఆర్ నాయుడు ఇద్దరు తమ ఛానళ్లలో ఒకరిపై ఒకరు వ్యతిరేకమైన కథనాలు ప్రసారం చేసుకుని విమర్శలకు దిగారు, రెండు చానళ్లలో బ్లాక్మెయిలింగ్ తరహాలో పేరు ప్రస్తావించకుండా ఓ చానల్ చేసిన తప్పిదాలు మరో చానల్ వారు ప్రోమోలు వేస్తున్నారు.
ఒకరు జూబ్లీ హిల్స్ సొసైటీ గురించి చెబితే మరొకరు అరచేతిలో వెంట్రుకలు మొలిపించే ఆయిల్ అని అంటున్నారు. మొదటి నుండి ఈ రెండు ఛానళ్లు వైయస్ జగన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ వచ్చాయి. కానీ సడన్ గా రెండు చానల్లో మధ్యే పోటీ ఉంది అని, వివాదాలు ఉన్నాయని బయటపడటంతో అందరూ షాక్ అవుతున్నారు. పరిస్థితి ఇలా ఉండగా ఇటీవల ఎన్టివి కొద్దిగా జగన్ కి ఫెవర్ గా ఉన్నట్లు, దీంతో ఏపీ ప్రభుత్వం అండతోనే టీవీ 5 ని దెబ్బ కొట్టడానికి ntv రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
అంతకు ముందు ఈ రెండు చానల్స్ టిడిపి పార్టీకి ఫేవర్ గా పని చేసేవి అని ఏపీ రాజకీయాల్లో టాక్ ఉండేది. కానీ తాజాగా ఈ రెండు ఛానల్స్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, దానికి సంబంధించి ఒక ఛానల్ పై మరొక ఛానల్ ప్రోమోలు ఎవరికి వారు ప్రసారం చేయటం, ఇప్పుడు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మరోపక్క మీడియా వర్గాల్లో వాస్తవానికి అలాంటిదేమీ ఉండదని ఇద్దరి మధ్య వ్యాపార వివాదాలు తలెత్తడంతో వ్యక్తిగత శత్రుత్వం వల్లే ఎవరికి వారు తమ బతుకులను ప్రజల ముందు పెట్టుకున్నట్లు చెప్పుకుంటున్నారు.
ఇదిలా ఉండగా త్వరలోనే రెండు చానల్స్ అధినేతలు నరేంద్ర చౌదరి, బిఆర్ నాయుడు సపరేట్ గా మీడియా సమావేశాలు పెట్టి ఒకరి బాగోతాలు మరొకరు బయట పెట్టడానికి రెడీ అవుతున్నట్లు టాక్ నడుస్తోంది.ఏదిఏమైనా మొన్నటివరకూ పాలు నీళ్ళు లా ఉండే ఈ రెండు ఛానల్ లు ఇప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ఏపీ మీడియాలోనూ రాజకీయరంగంలోనూ సంచలనంగా మారింది.