భూమి మీద ఇప్పటి వరకు ధనవంతులైన దేశాల పేర్లు మనం విన్నాం. అయితే తాజాగా ధనవంతమైన ఒక గ్రహం కూడా మనం నివసిస్తున్న అంతరిక్షంలో ఒకటి ఉన్నట్లు తాజాగా ఇటీవల నాసా సంస్థ తెలిపింది. చాలావరకు రిచెస్ట్ ప్లానెట్ గురించి కొన్ని హాలీవుడ్ సినిమాల్లో చూడటం జరిగింది. అయితే తాజాగా ఈ రిచ్చెస్ట్ ప్లానెట్ గురించి నాసా మాట్లాడుతూ….మనం నివసిస్తున్న భూమి కి దగ్గర లో ఉన్నట్లు చెప్పుకొచ్చింది. అంతేకాకుండా అందులో ఖరీదైన ఖనిజ సంపదలు ఉన్నట్లు కూడా తెలిపింది. ఈ దెబ్బతో భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కోటీశ్వరులు అయిపోవచ్చు అనే రీతిలో చెప్పుకొస్తోంది.
భూమికి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో సరిగ్గా అంగారకుడు, బృహస్పతి గ్రహాలకు సమీపంలో 140 మైళ్ళ పొడవు దూరంలో ఒక గ్రహశకలం ఇటీవల నాసా కనుగొన్నట్లు అందులో ఐరన్, నికేల్, గోల్డ్, ప్లాటినం వంటి మినరల్స్ ఉన్నట్లు నాసా తెలిపింది. దీని విలువ సుమారు 700000000000000000000 డాలర్లు అని తేలింది. ఈ గ్రహ శకలం మీద ప్రయోగాలు చేస్తే మరిన్ని సీక్రెట్స్ బయట పడే అవకాశం ఉందని నాసా శాస్త్రజ్ఞులు చెప్పుకొస్తున్నారు. ఈ గ్రహ శకలం మీద 2022 లో నాసా అంతరిక్షంలో ప్రయోగం చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
నిజంగా అందులో ఉన్న ఖనిజ సంపద భూమి మీద ఉన్న అందరికీ పంచితే అందరూ కోటీశ్వరులు అయిపోతాయి అని ఖగోళ శాస్త్ర నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి గ్రహశకలాలు మరిన్ని విశ్వంలో ఉండే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఈ వార్త విని చాలా మంది సోషల్ మీడియాలో నిజంగా గ్రహశకలం లో ఉన్న బంగారమంతా లభ్యమైతే ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న బంగారం రేటు పడిపోతుందని, బంగారం కి పెద్ద విలువ ఉండదని పేర్కొంటున్నారు.