భువనేశ్వర్, జనవరి 15: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఒడిషాలో అధికారిక పర్యటన నిర్వహించగా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దూరంగా ఉండిపోయారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బిజెపికి ప్రత్యర్థి పార్టీల మధ్య దూరం పెరుగుతుందనడానికి ఇది ఉదాహరణగా కనబడుతొంది. ప్రోటోకాల్ ప్రకారం ఏ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి అయినా ప్రధాన మంత్రి అధికారక పర్యటనలో ఆయన వెంట పాల్గొనడం సహజం. ప్రైవేటు, పార్టీ కార్యక్రమాల్లో అయితే ప్రత్యర్థి పార్టీల సిఎంలు పాల్గొనాల్సిన పని లేదు. మోదీ నేడు ఒడిషాలో మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టును ప్రారంభించారు.
previous post
next post