YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక.. భారీ మెజారిటీ ఇచ్చిన రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. సంక్షేమం విషయంలో ప్రాంత, పార్టీ, మత, కుల భేదాలు లేకుండా.. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ముఖ్యంగా కరోనా రావటంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో… ఉపాధి లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి డబ్బులు జమ చేస్తూ కీలక సమయంలో ప్రజలను ఆదుకుంటున్న సంగతి తెలిసిందే.
ప్రజల ఆరోగ్యపరంగా… “వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం” ద్వారా పేదవాడికి వైద్యం కొరత లేకుండా కరోనా చికిత్స కూడా ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకువచ్చి.. అనేక మంది ప్రాణాలను జగన్ కాపాడటం జరిగింది. ఇదిలా ఉంటే రెండేళ్ళ కాలంలో జగన్ ప్రభుత్వం గర్భిణీలకు అందించిన సేవలు వివరాలు చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు వైసీపీ ప్రభుత్వాన్ని శభాష్ అంటున్నారు. మేటర్ లోకి వెళ్తే గర్భిణీలకు ఉచిత వైద్యం తోపాటు ప్రసవానంతరం.. సురక్షితంగా ఇంటికి పంపించే కార్యక్రమం కూడా జగన్ సర్కార్ చేస్తూ ఉంది.
Read More: YS Jagan: ప్రవేట్ హాస్పిటల్స్ కి షాక్ ఇచ్చేలా మోడీకి సీఎం జగన్ విజ్ఞప్తి..!!
ఈ క్రమంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 2020-21 లో 2,20,731 మంది తల్లులు ప్రభుత్వ రవాణా ద్వారా సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. మొత్తం డెలివరీలో ప్రభుత్వ రవాణా సేవలను వినియోగించుకున్న తల్లులు 77.83%. ప్రభుత్వం ఇచ్చే పోషకాహారాన్ని వినియోగించుకున్న తల్లుల సంఖ్య 2.66 లక్షల మంది. ఉచిత వైద్య పరీక్షలు, రక్తపరీక్షలు చేయించుకున్న వారి సంఖ్య 2,67,067. కేవలం రెండేళ్ళ కాలంలో భారీ సంఖ్యలో జగన్ ప్రభుత్వం గర్భిణీలకు వైద్య సేవలు అందించడం జరిగింది. గత ప్రభుత్వాలలో ఎన్నడూ జరగని విధంగా ఈ రెండేళ్ల కాలంలో జగన్ ప్రభుత్వం గర్భిణీలకు.. మంచి పోషకాహారం తోపాటు డెలివరీ అయ్యాక తల్లి బిడ్డలను అంబులెన్స్ ద్వారా ఇంటికి కొన్ని లక్షల లో చేర్చటం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.