విశాఖ, జనవరి 19: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై జరిగిన దాడి కేసులో ఎన్ఐఎ అధికారులు శనివారం వైజాగ్ మాజీ ఎమ్మెల్యే విజయ ప్రసాద్ను విచారించారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) కేసును ఆధీనంలోకి తీసుకున్నప్పటి నుండి దర్యాప్తు వేగవంతం చేసింది.
ఎన్ఐఎ అధికారులు ఇప్పటికే నిందితుడు శ్రీనివాసరావును కోర్టు అనుమతితో అదుపులోకి తీసుకొని ఆరు రోజుల పాటు విచారణ నిర్వహించింది. పలు కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తుంది.
సిట్ అధికారులు దర్యాప్తు వివరాలు అందజేయకపోవడంపై ఎన్ఐఎ కోర్టులో సిట్ అధికారుల తీరుపై పిటిషన్ కూడా దాఖలు చేశారు. కేసు విచారణను కోర్టు ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది.
శనివారం ఎన్ఐఎ అధికారులు విశాఖపట్నం సీతమ్మధారలో వైసిపి మాజీ ఎమ్మెల్యే ఎం విజయప్రసాద్ను విచారణ చేశారు.