Nimmagadda Ramesh Kumar : మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల సమయంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ మంత్రి పెద్ద రెడ్డి ని హౌస్ అరెస్టు చేయాలని, మీడియా ముందు మాట్లాడకూడదు అనే తరహా లో నోటీసులు ఇవ్వడం తెలిసిందే. ఈ విషయం పై మంత్రి పెద్దిరెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ కూడా నిమ్మగడ్డ తమ హక్కులను హరించే రీతిలో వ్యవహరించారని అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేయటంతో .. ప్రివిలేజ్ కమిటీ నిమ్మగడ్డ వివరణ ఇవ్వాలంటూ ఇటీవల నోటీసులు పంపించడం జరిగింది.
ఇలాంటి తరుణంలో ప్రివిలేజ్ కమిటీకి తనదైన శైలిలో స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు నిమ్మగడ్డ. కరోనా వ్యాక్సిన్ వేసుకోవడంతో కొన్నాళ్ళపాటు ఎక్కడికి ప్రయాణం చేయలేను అని రిప్లై ఇచ్చారు. అంతమాత్రమే కాకుండా సభపై తనకి ఎనలేని గౌరవం ఉందని, ఈ క్రమంలో తాను ఎక్కడా కూడా శాసనసభ హక్కులకు భంగం కలిగించ లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రివిలేజ్ కమిటీకి రావాల్సిన అవసరం లేదు అంటూ నిమ్మగడ్డ పేర్కొన్నారు. ఇంకా ఈ వివాదంపై ముందుకు వెళ్లాలి అని మీరు భావిస్తే సరైన టైంలో సాక్ష్యాధారాలతో మీ దగ్గరకు వస్తాను అంటూ నిమ్మగడ్డ లెటర్ ద్వారా ప్రివిలేజ్ కమిటీకి వివరణ ఇచ్చారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?