Nimmagadda Ramesh Kumar : పంచాయతీ ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ మంచి దూకుడు మీద వ్యవహరిస్తున్నారు. ఇదే తరుణంలో మొదటిలో నిమ్మగడ్డ వ్యవహరిస్తున్న తీరుపై దూకుడుగా వ్యవహరించినా జగన్ సర్కార్ తాజాగా తగ్గుతూ ఎన్నికలకు సహకరిస్తామని ప్రకటించడంతో ఏపీలో ఎన్నికల వాతావరణం అలుముకుంది. ఇప్పటికే ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ప్రభుత్వ కార్యక్రమాలు చాలావరకు ఆగిపోయాయి.
ఇలాంటి తరుణంలో సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరింత దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటూ బుధవారం ఉదయం 11 గంటలకు రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. ఈ క్రమంలో సీఎస్ ఆధిత్యనాథ్ దాజ్ డీజీపీలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నబోతున్నారు. ఎన్నికల నిర్వహణపై ఉన్నతాధికారులతో ఈ సమావేశంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ చర్చించనున్నారు. ముఖ్యంగా నామినేషన్ లకు సంబంధించిన ఏర్పాట్లు అదేవిధంగా ఓటర్ల లిస్టు రూపకల్పన తదితర వంటి అంశాలపై దిశానిర్దేశం చేయబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఓటింగ్ సమయంలో భద్రతా పరమైన అంశాలపై కూడా కొన్ని సూచనలు ఇవ్వండి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఎన్నికల అధికారులకు నిమ్మగడ్డ Nimmagadda Ramesh Kumar : దిశానిర్దేశం :-
ఎన్నికలు జరిగే విషయంలో.. నామినేషన్ విషయంలో కీలకమైన సూచనలు కలెక్టర్లు మరియు ఎస్పీలకు బుధవారం కీలక సూచనలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇవ్వనున్నట్లు టాక్. ఇదిలా ఉంటే మరో పక్క పంచాయతీ ఎన్నికల విషయంలో జగన్ ప్రభుత్వం కేంద్ర సర్కార్ పెద్దలతో మంతనాలు జరపడానికి రెడీ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్న ఉద్యోగ సిబ్బంది చేత ఎన్నికలు జరిపించడం అంటే అది కష్టంతో కూడిన విషయమని.. ఈ విషయంలో కొద్దిగా ఆలోచించాలని కోరనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. మరోపక్క మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో కచ్చితంగా 100% విజయం సాధిస్తామని, వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రానికి లేఖ రాశామని, కేంద్రం నుంచి వచ్చే గైడ్ లైన్స్, డెసిషన్ ఆధారంగా ఎన్నికలకు వెళ్తామని బొత్స తెలిపారు.