Nimmagadda Ramesh Kumar: రాయలసీమలో వైసీపీ ని దెబ్బ కొట్టే రీతిలో నిమ్మగడ్డ సరికొత్త ఎత్తుగడ..??
Nimmagadda Ramesh Kumar: పంచాయతీ ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ మంచి దూకుడు మీద వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఒకపక్క న్యాయ స్థానాల నుండి తీర్పులు అనుకూలంగా రావడంతో పాటు ప్రభుత్వం కూడా పంచాయతీ ఎన్నికల విషయంలో కొద్దిగా వెనక్కి తగ్గడంతో నిమ్మగడ్డ స్పీడ్ పెంచారు. ఇలాంటి తరుణంలో రాయలసీమ ప్రాంతం వైపు ఎక్కువగా నిమ్మగడ్డ పంచాయతీ ఎన్నికల టైంలో పర్యటనలు చేయడం ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి గతంలో పంచాయతీ ఎన్నికల సమయంలో రాయలసీమ లోని అత్యధిక ఏకగ్రీవాలు చోటుచేసుకున్నాయి. ఇదే క్రమంలో ప్రతిపక్షాలు కూడా ఈ ఏకగ్రీవాలు విషయంలో ఫిర్యాదులు చేయడం జరిగింది.
Nimmagadda Ramesh Kumar: అధికారులతో సమీక్షలు:-
ఈ నేపథ్యంలో శుక్రవారం అనంతపురం పర్యటన అదేవిధంగా తర్వాత కర్నూలు, కడప పర్యటన లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ బిజీ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ జిల్లాలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు పరిశీలన చేయటానికి పర్యటించ బోతున్నారట. ఇదే టైంలో అధికారులతో నేరుగా సమీక్షలు కూడా నిర్వహించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈసారి కొత్తగా జరగబోయే పంచాయతీ ఎన్నికలలో రాయలసీమలో వైసిపి పార్టీ బలంగా ఉండటంతో అక్కడ ఏకగ్రీవాలు జరగకుండా ఉద్దేశంతో నిమ్మగడ్డ పర్యటన చేస్తున్నట్లు సరికొత్త టాక్ ఏపీ రాజకీయాల్లో వినబడుతోంది.
Nimmagadda Ramesh Kumar: ఏకగ్రీవాలకి చెక్ :-
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్రంలో జరిగిన చాలా ఎన్నికలలో రాయలసీమ ప్రాంతంలో అత్యధిక శాతం వైసిపి పార్టీ యే భారీ స్థాయిలో విజయాలు సాధించడం జరిగింది. 2014 ఎన్నికలు చూసిన తర్వాత వచ్చిన 2019 ఎన్నికల్లో జగన్ పార్టీ ఊహించని విధంగా విజయాలు నమోదు చేసుకోవడం జరిగింది. కాగా మార్చిలో జరిగి ఆ తర్వాత అర్థాంతరంగా వాయిదా పడిన స్థానిక సంస్థలలో జడ్పిటిసి అదేవిధంగా ఎంపీటీసీ లలో చాలావరకు వైస్సార్సీపీ కి అత్యధిక శాతం ఏకగ్రీవం కూడా అయ్యాయి. దీంతో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నే సీమ ప్రాంతంలో ఏకగ్రీవాలు నిలువరించడానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాయలసీమ ప్రాంతంలో పర్యటన చేయబోతున్నట్లు వార్తలు ఏపీ రాజకీయాల్లో వినపడుతున్నాయి.