Swamy Nithyananda: ఆధ్యాత్మిక గురువు స్వామి నిత్యానంద ఇండియాలో కరోనా పరిస్థితి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయన శిష్యులలో ఒకరు ఇండియాలో కరోనా ఎప్పుడు అంతం అవుతుంది అని ప్రశ్నించగా..? దానికి సమాధానం ఇస్తూ తాను ఎప్పుడైతే భారతదేశంలో అడుగు పెట్టడం జరుగుతుందో అప్పుడు వైరస్ అంతమవుతుందని పేర్కొన్నారు. నిత్యానంద ఈక్వెడార్ అనే ప్రాంతం వద్ద ద్వీపం కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దానికి కైలాస అని పేరు పెట్టి దాన్ని ఒక దేశంగా తీర్చిదిద్దాలని నిత్యానంద అనేక ఆలోచనలు చేస్తూ ఉన్నారు.
ఐక్యరాజ్యసమితి కైలాస ద్వీపాన్ని దేశంగా గుర్తించాలని కూడా లేఖలు రాయడం జరిగింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం భారత్ బ్రెజిల్ ఇంకా మరికొన్ని చోట్ల వైరస్ తీవ్రత అధికంగా ఉండటంతో . .. ఆయా దేశాల ఎంబసీలు లకు కైలాస ప్రాంతాలకు రావొద్దని .. పౌరులను పంపించవద్దు అనే స్వామి నిత్యానంద స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే కైలాస లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాస .. రాష్ట్ర క్యాబినెట్ ఇంకా అనేక రీతులుగా వ్యవస్థలను తీసుకురావడానికి నిత్యానంద రెడీ అయ్యారు.
Read More: Corruption Killing India: నిజమే…! కరోనా కాదు.. కరప్షన్ ఇండియాని చంపేస్తుంది..!!
ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి కి రాసిన లెటర్ లో కైలాస దేశం హిందూ పునరుద్ధరణకు పాల్పడుతోందని పేర్కొన్నారు. ఇదే క్రమంలో కైలాస పౌరసత్వం కావాలని అనుకునేవాళ్ళు విరాళాలు ప్రకటించాలని స్వామి నిత్యానంద స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలో ఎక్కడైతే మహమ్మారి తీవ్రత ఉందో ఆయా దేశాలకు చెందిన వారు తమ ప్రాంతంలోకి రావొద్దని పేర్కొన్నారు.