విజయవాడ, జనవరి 23: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో ఎవరితో పొత్తు లేకుండా పోటీ చేస్తుందని పార్టీ వ్యవహారాల రాష్ట్ర ఇన్చార్జి ఉమెన్ చాందీ చెప్పారు. విజయవాడలో బుధవారం పార్టీ ఇసి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాబోయే ఎన్నికల్లో తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఇతర నాయకులతో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేయడానికి తమ నాయకులు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
రాహుల్ గాంధీ ద్వారానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు కూడా విశ్వసిస్తున్నారని చాందీ చెప్పారు.
ఫ్రిబవరి ఒకటిన జరిగే బంద్ను జయప్రదం చేయాలి – రఘువీరారెడ్డి
ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఒకటిన జరిగే రాష్ట్ర బంద్ను జయప్రదం చేయాలని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి పిలుపు నిచ్చారు. బుధవారం జరిగిన ఇసి సమావేశంలో ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు బంద్ విజయవంతానికి మద్దతు ఇవ్వాలని కోరారని, కాంగ్రెస్ పార్టీ బంద్కు సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని రఘువీరారెడ్డి చెప్పారు.
ప్రధాని మోదీ ఏవేవో నిర్ణయాలు చేస్తున్నారు, లక్ష కోట్ల ఎన్నికల తాయిలాలు ఇస్తామంటున్నారు, అడక్కపోయినా అగ్రవర్గాలకు రిజర్వేషన్ ఇచ్చామని చెప్పుకుంటున్నారని రఘువీరారెడ్డి అన్నారు. ఆఖరి సమావేశాల్లో అయినా అయిదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకోవాలని రఘువీరా రెడ్డి కోరారు.
ప్రజలు ఇందిరమ్మతో సమానంగా చూసుకునే ప్రియాంకను ఉత్తర ప్రదేశ్ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడం పట్ల రఘువీరా రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఏఐసిసి జనరల్ సెక్రెటరీ ప్రియాంక బాధ్యతలు తీసుకోవడం దేశ వ్యాప్తంగా ప్రభావం ఉంటుందని, ఇక కాంగ్రెస్ ప్రభంజనం వీస్తుందని రఘువీరారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్ని పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై పోటీ చేయడం ఖాయమని రఘువీరారెడ్డి పేర్కొన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?