Corona Mask’s: 2019 వ సంవత్సరంలో నవంబర్ మాసంలో చైనా దేశం లో బయటపడ్డ కరోనా ప్రపంచ దిశ దశ మార్చేసింది. సామాన్యుడి మొదలుకొని ప్రధాని వరకు ప్రతి ఒక్కరిని కదిలించింది. అనేక దేశ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టింది. ఒక విధంగా చెప్పాలంటే మనిషి జీవితాన్ని తల్లకిందులు చేసింది. ఇప్పటికీ ఈ వైరస్ నుండి.. ప్రపంచంలోనే ధనిక దేశాలుగా.. పిలవబడే దేశాలు ఈ మహమ్మారి నుండి తప్పించుకోలేక పోతున్నాయి. మరోపక్క చాలా దేశాలలో సెకండ్ వేవ్..థర్డ్ వేవ్.. వచ్చే పరిస్థితి. ప్రస్తుతం ఇండియాలో సెకండ్ వేవ్ కొనసాగుతోంది. భారత్ లో సెకండ్ వేవ్ పరిస్థితి చూస్తే.. మరణ మృదంగం అన్నట్టు ఉంది. రోజుకి మూడు లక్షలు కొత్త పాజిటివ్ కేసులు పాటు వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ప్రపంచంలో చాలా దేశాలలో పరిస్థితి ఈ విధంగానే ఉంది.
ఇలాంటి తరుణంలో భూమి మీద కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో ఒక దేశం మాత్రం ధైర్యంగా ఎదుర్కొని నిలబడింది. దేశంలో ప్రజలు ఎవరూ మాస్కులు కూడా పెట్టుకో అక్కర్లేదు అంటూ ధైర్యంగా అధికారికంగా ప్రకటించింది. ఆ దేశం పేరే “ఇజ్రాయేల్”. ఆసియా దేశంలో ఇండియా కి అత్యంత నమ్మకమైన దేశం “ఇజ్రాయెల్”. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇజ్రాయేల్ .. చాలా తెలివైన దేశం మాత్రమే కాక.. సముద్రపు నీటిని మంచి నీటి గా మార్చుకొని.. ఎడారులలో అత్యంత లాభసాటి కరమైన పంటలు పండించే దేశం. యూదులు ఎక్కువగా ఉండే ఈ దేశంలో చాలా మంది సైంటిస్టులు.. అనేక వస్తువులను కనిపెట్టిన వాళ్ళు .. ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వాళ్ళు ఈ దేశంలో పుట్టడం జరిగింది.
ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీసుకున్న నిర్ణయాలు:-
కోటి మంది జనాభా కలిగిన ఈ దేశం.. కరోనా వైరస్ వచ్చిన వెంటనే.. ఇది కావాలని చైనా దేశం ప్రపంచం లోకి విడుదల చేసిందని తెలిపింది. ప్రపంచంలో అన్ని దేశాల్లో కంటే మొట్టమొదటిసారిగా చైనాపై .. కరోనా విషయంలో ఆరోపణలు చేసిన దేశం ఇజ్రాయిల్. అటువంటి ఇజ్రాయెల్ కరోనా వైరస్ ని చాలా డిఫరెంట్ గా హ్యాండిల్ చేసింది. ముఖ్యంగా ఇజ్రాయేల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ.. ఈ వైరస్ వచ్చిన వెంటనే లాక్ డౌన్ చేపట్టి ఒకపక్క దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా.. సంవత్సరం పాటు నడిపించారు. దేశంలో ఎవరు బయటికి రాకుండా సంవత్సరంపాటు దేశాన్ని లాక్డౌన్ లో పెట్టారు. ముఖ్యంగా ఇజ్రాయేల్ టూరిస్ట్ కంట్రీ కావటంతో పాటు మూడు ఖండాలకు మధ్యలో ఉండే దేశం కావటంతో.. వైరస్ బయట పడిన వెంటనే బెంజమిన్ నెతన్యాహు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఆ దేశ స్థితి గతులను మార్చేసింది.
తక్కువ టైమ్ లోనే ఇజ్రాయిల్ పౌరులందరికీ వ్యాక్సిన్:-
ఫైజర్ వ్యాక్సిన్ కంపెనీ సీఈఓతో మంతనాలు జరిపి .. చాలా తక్కువ టైమ్ లోనే దేశంలో .. ప్రతి సిటిజన్ కి వ్యాక్సిన్ వేయించి ఇప్పుడు కరోనా బారినుండి “ఇజ్రాయిల్” దేశాన్ని రక్షించుకున్నారు. దేశంలో ఇప్పుడు కరోనా నిబంధనలు ఏమీ పాటించకుండా .. ఏడాది పాటు నిలిచిపోయిన వ్యవస్థ ఇప్పుడు విజయవంతంగా సాగుతోంది. అత్యంత తక్కువ జనాభా కలిగిన దేశం కావటంతో “ఇజ్రాయిల్” .. త్వరగానే వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం చేయడంతో ఇప్పుడు అక్కడ .. మహమ్మారి తీవ్రత లేకుండా పోయింది. దీంతో ఆ దేశ అధికార ప్రతినిధులే మాస్కులు అవసరం లేదని ధైర్యంగా చెప్పటంతో ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్ దేశాన్ని చూసి ఆశ్చర్య పోతున్నాయి.