చెన్నై, జనవరి 28: తమిళనాడులో ‘కమలం’ వికసించబోదని కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి ఖుష్బూ వ్యాఖ్యానించారు. రాష్టంలో కాలు మోపాలని ప్రధాని మోది ప్రయత్నిస్తుంటే రాష్ట్ర ప్రజలు గో బ్యాక్ మోదీ అనే నినాదాన్ని ట్రెండింగ్ చేస్తున్నారంటూ ఆమె ట్విట్ చేశారు.
బిజెపికి, ప్రధాని మోదికి ఇక్కడ రవ్వంత చోటు కూడా దొరకదని అమె పేర్కొన్నారు. తమిళనాడులో ప్రధాన పర్యటన సందర్భంగా మోదీ గో బ్యాక్ అంటూ నిరసనలు వెల్లువెత్తిన నేపధ్యంలో ఖుష్బూ ఈ విధంగా స్పందించారు.