మూడున్నర సంవత్సరాల క్రితం రాజధాని అమరావతి నగరం శంఖుస్థాపనకు వచ్చిపుడు ప్రధాని మోదీకి అఖండ స్వాగతం పలికిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎంత అవమానించాలో అంత అవమానించింది. ప్రధాని హోదాలో రెండవ సారి రాష్ట్రానికి వచ్చిన నరేంద్ర మోదికి గన్నవరం విమానాశ్రయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వాగతం పలికేందుకు ప్రజాప్రతినిధులు ఎవరూ లేరు. గవర్నర్ నరసింహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ పునేఠా, డిజిపి ఠాకూర్, విజయవాడ పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు ఆయనకు స్వాగతం పలికారు.
ఇక రాజకీయపరంగా మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ నేతృత్వంలో కొందరు బిజెపి నాయకులు ప్రధానికి స్వాగతం పలికారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను విమానం దగ్గరకు అనుమతించలేదు. ఈ స్వాగతంతో సరిపెట్టుకుని ప్రధాని హెలీకాప్టర్లో గుంటూరు వెళ్లారు. అక్కడ ఆయన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
ప్రధాని ఆంధ్రప్రదేశ్ పర్యటన కోసం మూడు అధికారిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అయితే రాష్ట్రంలో ఉవెత్తున లేస్తున్న నిరసనలను దృష్టిలో ఉంచుకుని కాబోలు ఆ కార్యక్రమాలను కూడా ఆయన గుంటూరు నుంచే రిమోట్ ద్వారా నిర్వహించే విధంగా ఏర్పాటు చేశారు.
ప్రత్యేక హోదా లేదంటూ నవ్యాంధ్రకు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటింన తర్వాత దాని కింద వచ్చే నిధులు, సహాయం కోసం కాలికి బలపం కట్టుకుని ఢిల్లీ చుట్టూ తిరిగి విసిగి వేసారి పోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మోదీకి నిరసన సెగ అంటాలన్న పట్టుదలతో ఉన్నారు. అందుకే ప్రొటోకాల్ను పక్కన పెట్టాలని నిర్ణయించారు.
ఆ ప్రకారమే విమానాశ్రయంలో స్థానిక మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు లేరు. స్థానిక శాసనసభ్యుడు లేడు. ప్రధాని అంతటి వాడు వస్తే అక్కడ స్వాగతం పలికేందుకు ప్రజా ప్రతినిధులన్న వారు ఒక్కడూ లేడు. గుంటూరులో జరిగే అధికారిక కార్యక్రమాలకు ప్రొటోకాల్ ప్రకారం హాజరు కావాల్సిన స్థానిక ఎంపి గల్లా జయదేవ్ కూడా గైరుహాజరవు తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?