Stalin: తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొద్దిసేపటి క్రితం ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడు రాష్ట్ర గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో 234 స్థానాలకు గాను డి.ఎం.కె కూటమి నూట యాభై ఆరు సీట్లను గెలుచుకోవడం తో..వన్ సైడ్ వార్ అన్న తరహాలో తమిళనాడు ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. దీంతో ముఖ్యమంత్రిగా స్టాలిన్.. ప్రమాణ స్వీకారం చేశారు, అదేవిధంగా 34 మందికి మంత్రివర్గంలో చోటు కల్పించారు. ముఖ్యంగా తన తండ్రి దివంగత కరుణానిధి టైం లో పనిచేసిన వారికి ఎక్కువ అవకాశం కల్పించారు. కరోనా నిబంధనలకు లోబడి .. అట్టహాసంగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం జరిగింది.
డీఎంకె .. కాంగ్రెస్ పార్టీ కూటమిగా ఏర్పడి అసెంబ్లీ ఎన్నికలలో భారీగా గెలవడంతో ప్రస్తుతం తమిళనాడులో.. కొత్త పొలిటికల్ వాతావరణం ఏర్పడింది. దాదాపు 10 సంవత్సరాల పాటు అన్నాడీఎంకే పార్టీకి తమిళ ప్రజలు పట్టం కట్టారు. జయలలిత మరణం ఆ తర్వాత కరుణానిధి మరణించటంతో .. స్టాలిన్.. కరుణానిధి వారసుడిగా తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎన్నిక అవటంతో.. పరిపాలన ఏవిధంగా ఉంటుందో అన్న డిస్కషన్లు ప్రజెంట్ తమిళ ప్రజలలో జరుగుతున్నాయి.
స్టాలిన్ మంత్రివర్గంలో ఉన్న సభ్యులు .. గీతా జీవన్, అనితా రాధాకృష్ణన్, రాజకన్నప్పన్, కె. రామచంద్రన్, చక్రపాణి, వి. సెంథిల్ బాలాజీ, ఆర్. గాంధీ, ఎం సుబ్రమణియన్, పి. మూర్తి, ఎస్ఎస్ శివశంకర్, పీకె. శేఖర్బాబు, పళనివేల్ త్యాగరాజన్, ఎస్ఎం. నాజర్, సెంజి కేఎస్ మస్తాన్, అన్బిల్ మహేష్ పొయ్యామొళి, ఎస్వీ గణేశన్, మనో తంగరాజ్, మదివేందన్, కయల్విళి సెల్వరాజ్, దురైమురుగన్, కెఎన్. నెహ్రూ, ఐ. పెరియస్వామి, పొన్ముడి, వేలు, ఎంఆర్కే పన్నీర్సెల్వం, కేకేఎస్ఆర్ రామచంద్రన్, తంగం తెన్నరసు, రఘుపతి, ముత్తుస్వామి, పెరయకుప్పన్, టీఎం. అన్బరసన్, ఎంపీ స్వామినాథన్. కొత్త వారికి స్థానం కల్పిస్తూ యువకులకు అవకాశం ఇచ్చి తన తండ్రి కరుణానిధి సమక్షంలో పని చేసిన కీలక నేతలకు..కీలక పగ్గాలు అప్పజెప్పరు స్టాలిన్.