ఝర్సుగుడ (ఒదిషా), జనవరి 17 : ఒదిషా రాష్ట్ర కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఝర్సుగుడ ఎమ్మెల్యే కిషోర్దాస్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్ష పదవితో పాటు ప్రాధమిక సభ్యత్వాన్ని సైతం వదులుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పార్టీ చీఫ్ రాహుల్ గాంధీకి రాజీనామా లేఖ పంపారు.
పార్టీలో తనకు ఎవరితోనూ విరోధం లేదని, నియోజకవర్గంలో అభివృద్ధి కోసం తాను అధికార బిజూ జనతాదళ్ పార్టీ(బిజెడి)లో చేరుతున్నాననీ ఆయన వెల్లడించారు. ఆయన ఎమ్మెల్యే పదవికి మాత్రం రాజీనామా చేయలేదు.
ఎన్నికల ముందు కిషోర్దాస్ పార్టీ వీడటం కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బేనని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. లోక్సభతో పాటు ఒదిషా శాసనసభకు కూడా ఎననికలు జరుగుతాయి.
తాను ఈ నెల 24న బిజెడిలో చేరనున్నట్లు కిశోర్దాస్ ప్రకటించారు.