అయోధ్యలో రామమందిరం కోసం రామ భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భూమి పూజ కార్యక్రమాలు చాలా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మందిర నిర్మాణం కోసం అనేక మంది న్యాయస్థానాలలో మరియు ప్రభుత్వాలతో పోరాడటం జరిగింది. హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే దేవులలో ఒకరైన శ్రీరాముడు మందిరం అయోధ్యలో నిర్మించాలని చాలామంది రామ భక్తులు ఎప్పటినుండో ఆశగా ఎదురు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ఓ రామ భక్తురాలు అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం 28 ఏళ్లుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. అయోధ్యలో రామాలయం ని సందర్శించి ప్రసాదం తిన్న తర్వాతే తన దీక్షను విరమిస్తా అని ఆ నిండు వృద్ధురాలు అంటుంది. పూర్తి వివరాల్లోకి వెళితే మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో జబల్పూర్ కి చెందిన ఊర్మిళ చతుర్వేది కి 82 సంవత్సరాలు. 1992లో బాబ్రీ మసీదు విధ్వంసం అనంతరం జరిగిన మత ఘర్షణల వల్ల చోటు చేసుకున్న సంఘటనలతో ఆమె ఎంతగానో కలత చెందారు.
దీంతో అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగే వరకు ఆహారం తీసుకోకూడదని అప్పుడే నిర్ణయానికి వచ్చారు. ఆనాటి నుండి 28 ఏళ్లుగా ఊర్మిళ చతుర్వేది నిరాహారదీక్ష చేస్తూనే ఉన్నారు. కేవలం పాలు, పెరుగు, పండ్లు తింటూ జీవిస్తున్నారు. ఇదిలా ఉండగా
ఈ నెల 5వ తారీఖున ప్రధాని మోడీ చేతుల మీదుగా అయోధ్యలో రామమందిరం భూమి పూజ శంకుస్థాపన జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అయోధ్యలో రాముడి ని దర్శించుకున్న తర్వాత ఆ ప్రసాదాన్ని స్వీకరించి అప్పుడు నిరాహార దీక్ష విరమిస్తానని ఊర్మిళ చతుర్వేది తాజాగా చెప్పుకొచ్చారు.