తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఇటీవల ప్రజల నుండి విపక్షాల నుంచి అదే రీతిలో న్యాయస్థానాలను తీవ్రంగా విమర్శలు రావడంతో, రాష్ట్రంలో కరోనా కట్టడి చేయడం విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ కరోనా చికిత్స విషయంలో నిర్ధారణ పరీక్షల విషయంలో గతంలో లాగా కాకుండా వ్యవహరిస్తోంది. కాగా ఇటీవల రాష్ట్రంలో కేసులు ఉన్న కొద్ది పెరుగుతున్న తరుణంలో మంత్రి ఈటల రాజేందర్ షాకింగ్ కామెంట్ చేశారు. రాష్ట్రంలో కరోనా రోగులు ఇబ్బంది పడకుండా ఎక్కడికక్కడ ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయటంతో పాటు ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతి ఇచ్చామని పేర్కొన్నారు.
తాజాగా ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో ట్రూనాట్ టెస్ట్ సెంటర్ ను ప్రారంభించిన సమయంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ కరోనా గురించి ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అంతే కాకుండా కేవలం వెయ్యి రూపాయలు ఖర్చు చేసి కరోనా వైరస్ నీ జయించవచ్చు, అదే రీతిలో వెయ్యి మందికి కరోనా వైరస్ సోకితే అందులో రెండు వందల మందికి మాత్రమే బెడ్స్ అవసరం అవుతున్నాయి. ఎవరూ ఆందోళన చెందవద్దని మంత్రి సూచించారు. దీంతో ఈటెల రాజేందర్ చేసిన కామెంట్లపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు.
వెయ్యి రూపాయల చికిత్స ఉన్నప్పుడు కరోనా వైరస్ ని ఆరోగ్యశ్రీ లోకి చేర్చ వచ్చు కదా. పక్క రాష్ట్రంలో సీఎం వైయస్ జగన్ చేసిన మాదిరిగా రాష్ట్రంలో కేసీఆర్ కూడా అలాంటి ఆలోచనలు తీసుకోవచ్చు కదా అంటూ ప్రశ్నిస్తున్నారు. వెయ్యి రూపాయలు అవుతాయి అని అంటున్నా మంత్రిగారు మరి ఇటీవల చాలామంది కరోనా బారినపడి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేసుకున్న సమయంలో లక్షలకు లక్షలు డబ్బులు చెల్లించారు మరియు వాళ్ల కి ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేస్తుందని సోషల్ మీడియాలో చాలామంది ప్రశ్నిస్తున్నారు. మరికొంతమంది కరోనా చికిత్స మెడిసిన్ కి వెయ్యి రూపాయలేనా అంటూ ఆశ్చర్యపోతున్నా రు.