కరోనా వైరస్ ఎఫెక్ట్ తో కాసుల దండ కోవటమే లక్ష్యంగా పెట్టుకున్నాయి కార్పోరేట్ స్కూల్స్. వందలు వేలు కాదు ఏకంగా లక్షల్లో స్కూల్ యాజమాన్యాలు పిల్లల తల్లిదండ్రుల దగ్గర నుండి ఫీజులు వసూలు చేస్తున్నాయి. నేరుగా స్కూల్ కి రాకపోయినా ఆన్ లైన్ పేమెంట్ చేయవచ్చు అంటూ పిల్లల తల్లిదండ్రులకు ఫోన్లు మీద ఫోన్లు చేస్తున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ఈ విధంగా కార్పొరేట్ స్కూల్స్ వ్యవహరించడం తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో ఎక్కువైపోయాయి. అంతేకాకుండా నగరంలో పలు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు అనుసరిస్తున్న విధానం వలన విద్యార్థుల ఆరోగ్యం పైన ప్రభావం చూపే అవకాశం ఉందని తెలంగాణ న్యాయస్థానం తన అభిప్రాయాన్ని ఇటీవల వ్యక్తం చేసింది.
ఆన్ లైన్ క్లాసుల వల్ల విద్యార్థులు మానసిక మరియు శారీరక అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. ముఖ్యంగా ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలపై సీరియస్ అయింది. ఆన్ లైన్ తరగతులు నిషేధించాలని హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ వేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ పై హైకోర్టులో విచారణ జరిగిన టైములో ఈ విధమైన వ్యాఖ్యలు చేసింది. చాలా వరకు నగరంలో కార్పొరేట్ పాఠశాలలు సరైన టైమింగ్ లేకుండా ఆన్లైన్ పాఠాలు చెబుతున్నాయని… అంత టైం విద్యార్థులు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని, అసలు ఈ విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుంది అని హైకోర్టు ప్రశ్నించింది.
గతంలో ఆన్లైన్ తరగతులు పట్ల విధివిధానాలను ఖరారు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పది రోజులు టైం న్యాయస్థానాన్ని ఇవ్వాల్సిందిగా కోరింది. ఫీజుల విషయంలో అదే విధంగా ఆన్లైన్ తరగతులు టైమింగ్ విషయంలో కొత్త విధివిధానాలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. ఇదిలా ఉండగా ఫీజులు వసూలు చేయొద్దని జీవోను పాఠశాలలు ఉల్లంఘిస్తున్నాయి అని పిటిషనర్ తన పిటిషన్లో హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో హైకోర్టు అధిక ఫీజు వసూలు చేస్తే తిరిగి ఇప్పించాలి కారం న్యాయస్థానానికి ఉందని స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈనెల 27వ తారీకు వాయిదా వేసింది.