NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

‘బిజెపికి మృత్యుఘంటిక’!

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి సవాలుగా మహా కూటమి నిర్మించేందుకు జరుగుతున్న ప్రయత్నాలలో భాగంగా శనివారం కొల్‌కతాలో భారీ ర్యాలీ జరగనున్నది. పశ్చిమ బెంగాల్  ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో జరగనున్న ఈ బహిరంగసభలో కనీసం ముగ్గురు ముఖ్యమంత్రులు, పలువురు ప్రతిపక్ష నాయకులు పాల్గొననున్నారు.

బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్స్‌లో సభ ఏర్పాట్లు చూసేందుకు వెళ్లిన మమత మీడియాతో మాట్లాడుతూ, ఈ ర్యాలీ బిజెపికి మృత్యు ఘంటిక అవుతుందని అన్నారు. ప్రధాని పదవికి పోటీ పడగలిగే నేతగా మమతను ఈ ర్యాలీ నిలబెడుతుందని భావిస్తున్నారు. సభ అనంతరం ప్రతిపక్ష నాయకులు కలిసి కూర్చుని బిజెపికి వ్యతిరేకంగా నిర్మించే ఐక్య సంఘటన రోడ్ మ్యాప్ గురించి చర్చిస్తారు.

కొల్‌కతా ర్యాలీకి కాంగ్రెస్ అగ్రనాయకత్వం హజరవుతుందా లేదా అన్న మీమాంస కూడా తేలిపోయింది. సోనియా, రాహుల్‌ గాంధీలు దీనికి హాజరు కారనీ, లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గె, అభిషేక్ మను సింఘ్వీ హాజరవుతారనీ ఆ పార్టీ ప్రకటించింది.

దీనిని మమత ఐక్య భారత ర్యాలీగా అభివర్ణిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఎన్సీపి నేత శరద్ పవార్, హెచ్‌డి దేవెగౌడ, రాష్ట్రీయ జనతాదళ్ నేత తేజస్వి యాదవ్, డిఎంకె అధినేత స్టాలిన్ తదితరులు ర్యాలీలో పాల్గొననున్నారు.

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానంటున్న తెలంగాణా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఈ ర్యాలీకి హజరయ్యే అవకాశం లేదు. చంద్రబాబుతో ఆయనకు పొసగటం లేదు. నిజానికి మమత కూడా మొదట్లో ఫెడరల్ ఫ్రంట్ అన్న వ్యక్తే. కెసిఆర్ మమతను ఒకసారి కలిశారు కూడా.

విచిత్రంగా బిజెపి ఎంపి శతృఘ్న సిన్హా కూడా ర్యాలీకి హజరవుతున్నారు. మాజీ ఆర్ధికమంత్రి యశ్వంత్ సిన్హాతో కలిసి ఆయన కొంత కాలంగా అసమ్మతి గళం వినిపిస్తున్నారు. యశ్వంత్ పార్టీ ప్రతినిధిగానే తాను కొల్‌కతా ర్యాలీకి హాజరవుతున్నట్లు ఆయన చెప్పారు. బిజెపి నాయకులు ఆర్‌ఎస్‌ఎస్‌ సమావేశాలకు హాజరు కావడం లా అని ఆయన ప్రశ్నించారు.

 

author avatar
Siva Prasad

Related posts

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju

Janasena: అభ్యర్ధులకు బీఫామ్ లు అందజేసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

Leave a Comment