(Photos:courtesy by ANI
ఢిల్లీ, ఫిబ్రవరి 27: పార్లమెంట్ లైబ్రరీ హాలులో బిజెపియేతర పక్షాలు భేటీ అయ్యాయి.
లోక్సభ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలి, పుల్వామా ఉగ్రదాడి, వాయుసేన దాడులు తదితర విషయాలతో పాటు అమరావతిలో నిర్వహించనున్న మహాకూటమి బహిరంగ సభపై చర్చించేందుకు విఫక్ష నేతలు భేటీ అయ్యారు. భారత్ – పాక్ల మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్న నేపథ్యంలో అజెండాలో కొన్ని మార్పులు జరిగినట్లు సమాచారం.
ఈ సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యుపిఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, ఆ పార్టీ సినియర్ నాయకులు అజాద్, ఎకె ఆంటోని, అహమ్మద్ పటేల్, టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ అధనేత్రి మమతా బెనర్జీ, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, జెడియు మాజీ నేత శరద్ యాదవ్, తృణముల్ కాంగ్రెస్ ఎంపి డేరిక్ ఒబ్రెయిన్, శిబూ సోరెన్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్సిపి నేత శరద్ పవార్ నివాసంలో ఇటీవల జరిగిన సమావేశంలో ముందస్తు కూటమికి వెళ్లాలని నిర్ణయించిన విషయంపైనా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.
భారత్ – పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నేడు జరగాల్సిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (సిబ్ల్యూసి) సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ రేపటికి వాయిదా వేసింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?