ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా ఎక్కడికక్కడ సమస్యలకు పరిష్కారం చూపుతూ తనదైన శైలిలో పాలన అందిస్తున్నారు జగన్. మొదటిలో ఇసుక అడ్డంపెట్టుకుని ప్రజావ్యతిరేకత తీసుకురావాలని భావించిన పెద్దగా పని అవ్వలేదు. ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియం విషయంలో తెలుగు భాష అంటూ రచ్చ రచ్చ చేసిన ప్రజల నుండి కొద్దిగా కూడా స్పందన రాలేదు. అటువంటి సమయంలో మూడు రాజధానులు అని మాట్లాడిన జగన్ వ్యాఖ్యలను అడ్డం పెట్టుకుని అమరావతి కి మద్దతుగా ప్రతిపక్షాలు ప్రజా ఉద్యమం లేపిన మిగతా ప్రాంతాల నుండి పెద్దగా స్పందన రాలేదు.
ఇటువంటి సమయంలో ఎక్కడా కూడా జగన్ ఛాన్స్ ఇవ్వని విధంగా వ్యవహరిస్తున్న తరుణంలో కోర్టు తీర్పులను అడ్డం పెట్టుకుని విషయం ఎలాంటిదైనా సరే ఏపీ లో ఉన్న ప్రతిపక్ష పార్టీ టిడిపి “జగన్ రాజినామా చేయాలి” అనే డిమాండునే నమ్ముకుని కాలం వెళ్లదీస్తున్నాయి. హైకోర్టు ఏపీ ప్రభుత్వం పై ఇస్తున్న వ్యతిరేక తీర్పులను ఆధారం చేసుకుని ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు నీలం సంజీవరెడ్డి తరహాలో జగన్ రాజీనామా చేయాలని తెగ డిమాండ్ చేస్తున్నారు.
తాజాగా ఇటీవల మూడు రంగుల విషయంలో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో ప్రభుత్వం వేసిన పిటిషన్ పై, సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును సమర్ధిస్తూ తీర్పు ఇవ్వడంతో టిడిపి పార్టీ నాయకులతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన తులసి రెడ్డి సైతం “జగన్ రాజినామా చేయాలి” అనే షాకింగ్ నినాదాన్ని ఎత్తుకుంటున్నారు. మొత్తం మీద ఏపీ లో ఉన్న ప్రతిపక్షాలకు ప్రజా సమస్యలను ఆధారం చేసుకుని పోరాటానికి ఏ మాత్రం ఛాన్స్ లేకపోవటంతో కోర్టు తీర్పు లపై విమర్శలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.