తెనాలి, జనవరి 13: పెదరావూరు వద్ద వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం ఇక్కడకు చేరుకున్నారు. తెనాలిలో పెద్ద ఎత్తన కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఎదురేగి ఘన స్వాగతం పలికారు. జనసేన పార్టీ సాంస్కృతిక విభాగాన్ని, ‘జాగోరే..జాగో’ అనే ప్రొగ్రామ్ను పవన్ కల్యాణ్ ప్రారంభించనున్నారు. ఆయన వెంట పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్, సీనియర్ నాయకుడు నాదెండ్ల మనోహర్ ఇతర నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమాల్లో భాగంగా రైతులు, అడపడుచులు మధ్య పవన్ కల్యాణ్ సంక్రాంతి వేడుకల్లో పాల్గొనడంతో పాటు డెల్టా రైతులతో ఇష్టాగోష్టి నిర్వహించనున్నట్లు సమాచారం.
previous post