Pakistan: పాకిస్తాన్ గురించి , అక్కడి పరిణామాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. షాకింగ్ సంఘటనలకు నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఆ దేశంలో తాజాగా ఓ కలకలం జరిగింది. మహిళ మీద మగాళ్లు దాడి చేయటమే నీచం. అలాంటి ఏకంగా 300 మంది మృగాళ్లు ఓ ఆడకూతురును చుట్టుముట్టి గాలిల్లోకి ఎగిరేస్తూ దాడి చేశారు. ఆ మహిళ బట్టలు చించుతూ రాక్షసంగా ప్రవర్తించడం అంతర్జాతీయ మీడియాలో సంచలన వార్తగా నిలిచింది.
Read More: Pakistan: భారత్ సరిహద్దుల్లో పాక్ కొత్త కుట్ర.. 15 ఏళ్ల పిల్లల్ని అలా వాడుకుంటూ…
స్వాత్రంత్య దినోత్సవం నాడు..
పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం ఈ నెల 14 న జరుపుతుండగా ఈ దారుణం చోటుచేసుకుంది. లాహోర్ లోని మినార్-ఇ-పాకిస్తాన్ వద్ద జెండా ఎగురవేసే కార్యక్రమానికి వందలాది మంది హాజరయ్యారు. ఐతే ఓ మహిళా టిక్ టాకర్ ఇక్కడే టిక్ టాక్ వీడియో చేయాలనుకుంది. తన స్నేహితులతో కలిసి వీడియో తీసుకునేందుకు ప్రయత్నించగా అక్కడున్న వాళ్లు ఆ మహిళపై దాడికి దిగారు. ఒక్కొక్కరుగా 3 వందల మందికి పైగా జమ అయ్యారు. ఒక్కరు కూడా దాడిని ఆపకపోగా ఇంకా ఉసిగొల్పారు. దాడి చేయటంతో పాటు ఆమె చేతికున్నఉంగరం, చెవి రింగులు, మొబైల్ ఫోన్, రూ. 15 వేలను లాక్కున్నారు. అక్కడున్న సెక్యూరిటీ గార్డు మినార్ గేటు తెరవటంతో ఆమె తప్పించుకుంది.
Read More: Pakistan: పాక్ బుద్ది మారే చాన్సేలేదా … కొంప కాలిపోతున్నా అదే మాట
పోలీసులకు ఫిర్యాదు..
ఈ దారుణ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు దాడి చేసిన వారిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కాగా బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దాడి చేసిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. మరోవైపు పాకిస్తాన్లో పరిణామాలపై అంతర్జాతీయ మీడియా ఆందోళన వ్యక్తం చేస్తోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?