దాయాది దేశం పాకిస్థాన్ సరిహద్దుల్లోనే కాకుండా ఐసీసీ సమావేశాల్లో కూడా తన వంకరబుద్ధి, కుట్రలు పోనిచ్చుకో లేదు. తాజాగా ఐసీసీ కొత్త చైర్మన్ ఎన్నిక విషయంలో సభ్య దేశాలు వర్చువల్ మీటింగ్ నిర్వహించాయి.
జరిగిన ఈ సమావేశంలో భారత్ మరియు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ల మధ్య విభేదాలు బయటపడ్డాయి. కొత్త చైర్మన్ ఎన్నిక ప్రక్రియ విషయంలో ఎప్పటిలాగానే సాధారణ మెజారిటీ ప్రకారం ఎన్నుకోవాలని భారత్, ఇంగ్లాండ్ మరికొన్ని దేశాలు పేర్కొన్నాయి.కానీ ఈ విషయంలో పాకిస్థాన్ మరియు కొన్ని దేశాలు మాత్రం మూడింట రెండు వంతుల మెజారిటీ ప్రకారం చైర్మన్ ఎన్నిక జరగాలని కొత్త వాదన తెరపైకి తెచ్చారు. దీంతో శశాంక్ మనోహర్ స్థానంలో కొత్త చైర్మన్ ఎన్నిక ప్రక్రియ గందరగోళంగా మారింది.
దీంతో విషయం అటు ఇటు తేలకుండానే ముగించాల్సి వచ్చింది. ఐసీసీలో 17 ఓట్లు ఉన్నాయి. మూడింట రెండు వంతుల మెజారిటీ ప్రకారం ఎన్నిక జరగాలంటే…. చైర్మన్ అభ్యర్థి 12 ఓట్లు అవసరమవుతాయి. మామూలు మెజారిటీ అంటే 9 ఓట్లు వస్తే సరిపోతుంది. అయితే ప్రస్తుతం ఐసీసీ బోర్డు లో గ్రూపు రాజకీయాలు జరగటంతో ఈ పరిణామం తలెత్తినట్లు రోడ్డు సభ్యులలో ఒకరు తెలిపారు.