ప్రపంచాన్ని తలకిందులు చేస్తున్న కరోనా వైరస్ మొన్నటివరకు పాకిస్థాన్ దేశంలో పెచ్చు మీరిపోయింది. రోజుకి దాదాపు రికార్డుస్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు బయటపడటంతో అక్కడి ప్రభుత్వం మరియు వైద్యులు తెగ కంగారు పడిపోయారు. కరోనా వైద్యం అందిస్తున్న వైద్యులకు కూడా కరోనా సోకే పరిస్థితి ఉండటంతో…. ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. అయితే ఇటీవల గత నాలుగు నుంచి ఐదు వారాలు దేశంలో స్మార్ట్ లాక్ డౌన్, మైక్రో స్మార్ట్ లాక్ డౌన్ వంటి వాటివి కరోనా తీవ్రత బట్టి అమలు చేయటం జరిగింది. దీంతో పాకిస్థాన్ దేశంలో కరోనా రికవరీ రేటు ఆసియా దేశాలలో కల్లా అత్యధిక రికవరీ రేటు సాధించినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి అసద్ ఉమర్ చెప్పుకొచ్చారు.
ఆసియా దేశాలలో ఎక్కువ కరోనా పాజిటివ్ రేట్ విషయంలో ఇరాన్ మరియు ఇండియా కంటే తక్కువగా ఉండటం శుభపరిణామమని అసద్ ఉమర్ చెప్పుకొచ్చారు. ఈ విధంగా మహమ్మారి కరోనా నుండి దేశం బయట పడటం, జయించడానికి కారణం దేశ ప్రజలు మరియు మీడియా అని అసద్ ఉమర్ స్పష్టం చేశారు. ప్రజలు, ప్రభుత్వం, మీడియా కలిసి పని చేస్తే ఏవిధమయిన ఫలితం వస్తుందో కరోనా విషయంలో పాకిస్థాన్ లో తేల్చిందని పేర్కొన్నారు. దాదాపు మహమ్మారి కరోనా వైరస్ ని పాకిస్థాన్ జయించినట్లే అంటూ స్పష్టం చేశారు. ఇదే రీతిలో ప్రజలు గతంలో మాదిరిగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని… పూర్తిగా ఈ వైరస్ ని తరిమే వరకు ప్రభుత్వాలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
పాకిస్థాన్ లో కన్ఫామ్ కేసులు 2,85,620, కరోనా మరణాలు 6,120, ఇప్పటివరకు కరోనా నుండి కోలుకున్నవారు 2,61,246. పాకిస్తాన్ దేశంలో ఎక్కువగా సింద్, పంజాబ్, బలోచిస్తాన్, కేపి, ఇస్లామాబాద్ మరియు కొన్ని ప్రాంతాలలో వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. అయితే ఇటీవల చేపట్టిన లాక్డౌన్ వల్ల ఈ ప్రాంతాలలో చాలా వరకు వైరస్ తగ్గుముఖం పట్టినట్లు పాకిస్తాన్ ప్రభుత్వం చెబుతోంది. అదే రీతిలో అంతర్జాతీయ స్థాయిలో కరోనా కొత్త కేసులు విషయంలో 14వ స్థానంలో పాకిస్తాన్ ఉంది. చాలావరకు మిగతా దేశాలతో పోలిస్తే కరోనా తో విషయంలో భళా అనే రీతిలో పాకిస్తాన్ పోరాడినట్లు తెలుస్తోంది.