హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. మరో కాంగ్రెస్ ఎంఎల్ఏ టిఆర్ఎస్లో చేరుతున్నట్టు ప్రకటించారు.
ఖమ్మం జిల్లా పాలేరు ఎంఎల్ఏ కందాల ఉపేందర్ రెడ్డి గురువారం టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్తో సమావేశమయ్యారు. భేటీ అనంతరం త్వరలోనే టిఆర్ఎస్లో చేరుతున్నట్టు ఉపేందర్ రెడ్డి ప్రకటించారు.
గత ఏడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉపేందర్ రెడ్డి టిఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై గెలుపొందారు.
ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగ కాంతారావు, హరిప్రియా నాయక్, చిరుమర్తి లింగయ్య టిఆర్ఎస్లో చేరారు. మహేశ్వరం ఎంఎల్ఏ సబితా ఇంద్రారెడ్డి, ఆమె తనయుడు కార్తీక్ రెడ్డి సైతం టిఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. అలాగే టిడిపి ఎంఎల్ఏ సండ్ర వెంకట వీరయ్య కూడా టిఆర్ఎస్లో చేరనున్నట్టు ప్రకటించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?