ప్రపంచంలో హిందువుల దశాబ్దాల కల అయోధ్య రామ మందిరం సాకారం అవుతున్న నేపథ్యంలో .. మందిర నిర్మాణానికి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పనుల బాధ్యతలు తీసుకున్న రామమందిర ట్రస్ట్ సభ్యులు దేశవ్యాప్తంగా మాత్రమే కాక ప్రపంచ వ్యాప్తంగా విరాళాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది రాజకీయ నాయకులు అదేవిధంగా సెలబ్రిటీలు తమ విరాళాలు ప్రకటించడం జరిగింది.
ఇదిలా ఉంటే తాజాగా అయోధ్య రామమందిరం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తన విరాళాన్ని ప్రకటించారు. ఏకంగా 30 లక్షల రూపాయలు రామమందిరం కోసం పవన్ కళ్యాణ్ ఇవ్వటానికి ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. దీంతో ఈ విషయం తెలుసుకొని పవన్ కళ్యాణ్ అభిమానులు అదేవిధంగా జనసేన కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మరోపక్క దేశ విదేశాల నుండి భారీ స్థాయిలో విరాళాలు అందుతున్న గాని ఆలయ నిర్మాణ ట్రస్ట్ సభ్యులు కొన్ని పరిమితులకు లోబడి మాత్రమే వివరాలు సేకరిస్తూ ఉంది. గత ఆగస్టు నెలలో ప్రధాని మోడీ చేతుల మీదగా ఆలయ నిర్మాణానికి సంబంధించి పునాది రాయి పడగా.. త్వరలోనే భారీస్థాయిలో మందిర నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడానికి ట్రస్టు సభ్యులు పక్క షెడ్యూల్ తో ప్రిపేర్ అవుతున్నారు.