జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించిన తర్వాత 2014 ఎన్నికల మినహా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎలాంటి ఎన్నికలలో కూడా వేలు పెట్టలేదు. అదేవిధంగా ఏ పార్టీకి కూడా మద్దతు ఇవ్వలేదు. ఫోకస్ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన పెట్టారు పవన్. అయితే 2019 ఎన్నికల్లో మొట్టమొదటిసారి పోటీ చేసి ఘోరంగా ఓడిన తర్వాత బిజెపికి దగ్గరయ్యారు పవన్. ఇంతలో కరోనా రావటంతో ఎక్కువ సమయం హైదరాబాద్ లోనే ఉండటం జరిగింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం దుబ్బాకలో ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో… బీజేపీ పార్టీ నుండి రఘునందన్ రావు పోటీ చేస్తున్న క్రమంలో పవన్ ప్రచారానికి వచ్చే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
బిజెపి ఈ ఉప ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగిందట. అందుకే జనసేనాని ప్రచారానికి రప్పించడానికి ప్లాన్ చేస్తుందట. ఒకటి రెండు రోజులు నియోజకవర్గంలో పవన్ ప్రచారం చేస్తే యువత ఓట్లను రాబట్టి అవకాశం ఉంటుందని బిజెపి ఆలోచన. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో కీలక నేతలు అయినా బండి సంజయ్, కిషన్ రెడ్డి లు ఈ మధ్యనే పవన్ తో సమావేశం అవ్వడం జరిగింది. ఆ సమయంలోనే దుబ్బాక లో బీజేపీ తరఫున ప్రచారం చేయాలని కోరారు అట. దీంతో దుబ్బాకలో గ్రౌండ్ రియాల్టీ ని జనసేన పార్టీ అంచనా వేయడం స్టార్ట్ చేసిందట. జరగబోయే ఉప ఎన్నికలకు పవన్ ప్రచారం చేస్తే ఎంతవరకు పార్టీకి లాభం ఉంటుంది అనే విషయాలపై జనసేన టీమ్ అంచనా వేస్తుంది అట,
దీంతో పవన్ దుబ్బాక ప్రచారానికి వెళ్లాలా వద్దా అన్న ప్రశ్నలకు సమాధానం వెతికే పనిలో జనసేన ఉందట. ఒకవేళ పవన్ దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారానికి వెళితే… జిహెచ్ఎంసి ఎన్నికలలో ఏం చేయాలన్న దానిపై కూడా జనసేన పార్టీలో మంతనాలు జరుగుతున్నాయట. గ్రేటర్ ఎన్నికలలో బిజెపికి మద్దతు ఇవ్వాలా పొత్తు పెట్టుకోవాలా సొంతంగా అభ్యర్థులను నిలబెట్టుకోవాలా అనేదానిపై కూడా చర్చ నడుస్తుంది అట. దీంతో పవన్ దుబ్బాక టూర్ తేలకముందే…. టిఆర్ఎస్ శ్రేణులు అప్పుడే పవన్ పై ఎదురుదాడి ప్రారంభించడం విశేషం. రాష్ట్రం ఏర్పడినప్పుడు పవన్ చేసిన కామెంట్లను వీడియోలను టీఆర్ఎస్ సోషల్ మీడియా వైరల్ చేస్తున్నాయి. మరి దుబ్బాక ఉప ఎన్నిక విషయంలో పవన్ అంతరంగం ఏంటో చూడాలి.