జనసేనాని పవన్ కల్యాణ్ మీద మాజీ ఎంపి జివి హర్షకుమార్ షాకింగ్ కామెంట్లు చేశారు.పవన్ కల్యాణ్ సీరియస్ రాజకీయ నాయకుడు కాదని, ఆయన అప్పుడప్పుడు మాత్రమే వస్తుంటారని,అంతేగాకుండా సరిగ్గా ఎన్నికలకు ముందు ఫలానా పార్టీ ని సపోర్టు చేయమని చెబుతుంటారని, ఒక పార్టీని అధినేత నడిపే తీరు ఇది కాదని హర్షకుమార్ అన్నారు.
హర్షకుమార్ చేరాలని ప్రయత్నించినా పవన్ కల్యాణ్ ఆయనను జనసేనలో చేర్చుకో లేదంటూ ఇటీవల కాలంలో వార్తలు గుప్పుమన్నాయి.తాజాగా ఒక న్యూస్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై హర్షకుమార్ క్లారిటీ ఇచ్చారు.జనసేనకు వెళితే బాగుంటుందని కొత్తగా వచ్చాడు పవన్ అని అనుకున్నానని హర్షకుమార్ చెప్పారు. తాను జనసేన పార్టీలో చేరాలనుకున్నందునే తన వర్గం నుంచి ఎంతో మందిని ఆ పార్టీలోకి పంపించానని హర్షకుమార్ చెప్పారు. పవన్ కల్యాణ్ కూడా తరచూ హర్షకుమార్ను కలవాలి.. ఆయన పెద్ద నాయకుడు అంటుంటే వారని ఆ పార్టీలోకి తాను పంపిన మనుషులు చెప్పారన్నారు.అయితే ఆయన తనను కలిసింది లేదన్నారు .తనకు ఆహ్వానం కూడా రాలేదన్నారు.
ఇందుకు కారణం ఏమై ఉంటుందని తాను విశ్లేషించుకుంటే తన వల్లే 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం రెండు జిల్లాల్లో ఓటమిపాలైందని హర్షకుమార్ ,దీనిని గుర్తుకు తెచ్చుకునే బహుశా పవన్ అభద్రతా భావానికి లోనై ఉంటారని అందుకే తనను పార్టీలో చేర్చుకుని ఉండకపోవచ్చునని తనకు అనిపించిందని హర్షకుమార్ చెప్పారు. దాంతో తాను కూడా సైలెంట్ గా ఉండిపోయానని ఆయన చెప్పారు.ఇపుడు పవన్ పిలిచి టికెట్ ఇస్తానన్నా వెళ్లనని పవన్ తనకు ఏరకంగాను సరిపోయే వ్యక్తి కాదని చెప్పారు. పవన్ కు లక్షల సంఖ్యలో అభిమానులు ఉండొచ్చని..అయితే ఆయన రాజకీయాలకు సరిపోయే వ్యక్తి కాదన్నారు . కానీ తాను నిరంతం పాలిటిక్స్ లో ఉంటానని కాబట్టి ఇద్దరికీ సెట్ అవదని చెప్పారు.
తాను మాజీ ఎంపీని అయినప్పటికీ తన బలం ఏమాత్రం తగ్గలేదని..ఇప్పటికీ హర్షకుమార్ అంటే ఒక బ్రాండ్ నేమన్నారు.భవిష్యత్తులో తానేమిటో రుజువు చేసుకుంటానన్నారు.ఇప్పుడైతే తాను ఇండిపెండెంటు నేనని హర్షకుమార్ స్పష్టం చేశారు.మధ్యలో కొన్నాళ్ళు టిడిపి సావాసం చేసి వచ్చిన విషయాన్ని మాత్రం హర్షకుమార్ తన ఇంటర్వ్యూలో ప్రస్తావించకపోవటం కొసమెరుపు.