Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ మోడీతో చర్చిస్తానని మొదటి లో మాట ఇవ్వటం మనకందరికీ తెలిసిందే. అయితే ఇటీవల బీజేపీతో తెగతెంపులు అన్న తరహాలో పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నట్లు తెలుగు రాజకీయాలలో వార్తలు వైరల్ అవుతున్నాయి. పరిస్థితి ఇలా ఉండగా మరో పక్క కేంద్రం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గేది లేదు అన్న తరహాలో వ్యవహరిస్తున్న తరుణంలో ..ఈ ఇష్యూ పై పవన్ షాకింగ్ వీడియో రిలీజ్ చేశారు.
మేటర్ లోకి వెళ్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కి వ్యతిరేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖ మేయర్ మరియు చేతిలో 151 మంది ఎమ్మెల్యేలు మరియు 22 మంది ఎంపీలు కలిగిన వైసిపి ఈ విషయంలో..ఢిల్లీలో ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని కోరారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఉక్కు పరిశ్రమ కోసం భూములిచ్చిన నిర్వాసిత రైతుల ఇబ్బందులపై చర్చించాలని పేర్కొన్నారు.
అంతేకాకుండా ఈ అసెంబ్లీ సమావేశాలలో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే మరో పక్క కేంద్రం అనుసరిస్తున్న వైఖరి కు మరింత ఉధృతంగా విశాఖలో అన్న కార్మిక సంఘాలు మరియు వివిధ పార్టీల రాజకీయ నేతలు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా విశాఖ స్టీల్ ప్లాంట్ నీ కాపాడుకోవడమే తమ ధ్యేయం అనే తరహా లో ..విశాఖలో రాజకీయ నాయకులు మరియు కార్మికులు ఒకే తాటిపై ఉన్నారు. మరోపక్క ఏపీ సీఎం జగన్ ఈ విషయంలో ప్రధాని మోడీ కి లెటర్ రాయటమే కాక అఖిలపక్ష నాయకులతో కలిసి మోడీతో చర్చించడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.