తిరుపతి: ఏపీ రాజధానిని విశాఖకు మార్చాలన్న సీఎం జగన్ నిర్ణయాన్ని తాను వ్యక్తిగతంగా స్వాగతిస్తున్నానని కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పల్లంరాజు అన్నారు. అయితే, పార్టీ అభిప్రాయం ఏమిటన్నది పీసీసీ అధ్యక్షుడు తెలియజేస్తారని చెప్పారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పల్లంరాజు ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాజధానిగా విశాఖ అనువైన ప్రాంతమన్నారు. అమరావతిని రాజధానిగా నిర్ణయించడంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుచేశారని అన్నారు. శివరామకృష్ణన్ నిర్ణయాన్ని కూడా ఆయన పరిగణనలోకి తీసుకోకుండా సొంత నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నందున ప్రభుత్వం పొదుపు చర్యలు పాటించాలని, సత్వరం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని పల్లంరాజు సూచించారు.
previous post
next post
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?