అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మొట్టమొదటి సంతకం చేసిన సామాజిక భద్రతా పించన్ పథకానికి సంబంధించి ప్రభుత్వం నేడు తొలి జివో విడుదల చేసింది. పించన్ను 2250 రూపాయలకు పెంచుతున్నట్లు జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఎన్టిఆర్ భరోసా పించన్గా ఉన్న ఈ పథకాన్ని వైఎస్ఆర్ పించన్ కానుక పథకంగా పేరు పెట్టారు. జూన్ ఒకటవ తేదీ నుండి కొత్త పించన్ అమలులోకి రానుంది. వికలాంగులకు మూడు వేలు, కిడ్నీ వ్యాధితో డయాలసిస్ చేయించుకుంటున్న బాధితులకు పదివేల రూపాయలు పించన్గా ఇవ్వనున్నారు. వృద్ధాప్య పించన్ అర్హత వయస్సును 65నుండి 60ఏళ్లకు కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?