చంద్రబాబు హయాంలో ఏపీ రాజధాని అమరావతి అని ప్రకటించిన పెద్దగా ప్రజాదరణ దక్కిన దాఖలాలు లేవు. కేవలం నిర్మాణాలు తప్ప ప్రజలు అక్కడ వెళ్ళటానికి నివాసం ఉండటానికి పరిస్థితులు అనుకూలించిన దాఖలాలు లేవు. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక, మూడు రాజధానులు నిర్ణయం తీసుకున్నాక ఏపీ రాజధాని ముఖ చిత్రం మారిపోయింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో విశాఖ ని రాజధానిగా గుర్తించడంతో ఇప్పుడు జనం అంతా విశాఖకు పరిగెడుతున్నట్లు లెక్కలు బయటపడుతున్నాయి.
పూర్తి విషయంలోకి వెళితే విశాఖలో ఇటీవల జనాభా శాతం పెరిగిందని, త్వరలోనే 30 శాతం పెరిగే ఛాన్స్ కూడా ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. విద్యా, వాణిజ్య, వైద్య పరంగా తదితర రంగాలలో విశాఖలో పరిస్థితులు గతానికి భిన్నంగా ఉండటంతో పాటు చాలా మంది వలస ప్రజలు ఇక్కడకి వస్తున్నారట. గతంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో నివసించే వాళ్ళు హైదరాబాద్ ప్రాంతానికి వలసగా వెళ్లిపోయేవారు.
కానీ తాజా పరిస్థితులు బట్టి ఉత్తరాంధ్ర ప్రాంతానికి దగ్గరగా ఉండే విశాఖలో అదే ప్రాంతానికి చెందిన ప్రజలకి ఉపాధి అవకాశాలు దొరికే రీతిలో కంపెనీలు నెలకొంటున్నయి. పైగా విశాఖ మెట్రోపాలిటన్ సిటీ కావటంతో ప్రముఖ కంపెనీలు అన్నీ ఇక్కడకు వస్తున్న తరుణంలో చదువుతున్న విద్యార్థులు కూడా ఎక్కువగా విశాఖ వైపు చూస్తున్నట్లు టాక్. మరోపక్క ప్రభుత్వం రాబోయే దసరా నాటికి ప్రభుత్వంలో కీలక శాఖలను ఇక్కడకు పంపించడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. మొత్తంమీద చూసుకుంటే విశాఖ పట్టణానికి రాజధాని లుక్ వస్తున్నట్లు తాజా పరిస్థితులు బట్టి అర్థమవుతోంది.