ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చంద్రబాబు మెడకి చుట్టుకునే అవకాశమున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్ ప్రభుత్వం జడ్జీల ఫోన్ లతో పాటు తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నట్లు ప్రధాని మోడీకి లెటర్ రాసి కేంద్ర దర్యాప్తు సంస్థ తో ఏపీలో ఫోన్ ట్యాపింగ్ కేసు టేకప్ చేయాలని కోరారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడాలని ప్రధాని మోడీకి రాసిన లెటర్ లో చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉండగా ఈ విషయంలో జగన్ దగ్గర ఏపీ ప్రభుత్వ అధికారులు మంత్రులు మాట్లాడినట్లు….. మొత్తం కేసు తీవ్రత గురించి జగన్ కి తెలిపినట్లు సమాచారం. కేవలం అబద్ధపు ఆరోపణలతో చంద్రబాబు ఈ పొలిటికల్ గేమ్ ఆడి, ఫోన్ టాపింగ్ అని ప్రభుత్వాన్ని కూల్చడానికి రెడీ అయినట్లు గుర్తించారట. దీంతో ఈ విషయంలో అసలు వదలకూడదు అని మామూలుగా రాజకీయ ఆరోపణలు వేరు ఫోన్ టాపింగ్ ఆరోపణలు వేరు.
ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏమాత్రం ప్రూవ్ చేయకపోతే సదరు ఆరోపణలు చేసిన వ్యక్తికి చాలా డామేజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు టాక్. ఇదే టైంలో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే మాకు తెలిపితే కేసు నమోదు చేసి వారిపై యాక్షన్ తీసుకుంటామని ఇప్పటికే తెలపడం జరిగింది.
అయితే ఈ విషయంలో చంద్రబాబు గాని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంటూ తెగ హడావిడి చేస్తున్న మీడియా ఏమీ మాట్లాడకపోవటం జరిగింది. దీంతో వీరందరికీ ఒకేసారి దిమ్మతిరిగే షాక్ ఇవ్వడానికి ఏపీ సీఎం జగన్ రెడీ అయినట్లు టాక్. తొందర్లోనే ఊహించని రీతిలో చంద్రబాబుకి, ఆయన సపోర్ట్ చేసే మీడియాకి దిమ్మతిరిగే షాక్ జగన్ ఇవ్వడానికి రెడీ అయినట్టు సమాచారం.