Gyanvapi mosque: ఉత్తర ప్రదేశ్ వారణాసిలో జ్ఞానవాపి మసీదు పై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ కి సంబంధించి విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. జ్ఞానవాపి మసీదుకి ముందు ఆ ప్రాంగణంలో కాశీ విశ్వనాథ్ ఆలయం తెలపటం మాత్రమేకాక ఇటీవల వీడియో సర్వే శివలింగాలు మరికొన్ని దేవతా విగ్రహాలు కూడా బయటపడ్డాయి.
దీంతో ఐదుగురు మహిళలు స్థానిక కోర్టును ఆశ్రయించటం అక్కడ నిత్య పూజలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరడం జరిగింది. దీంతో శివలింగం ఉన్న ప్రాంతానికి రక్షణ కల్పించాలని.. మరోపక్క నమాజ్ చేసుకోడానికి కూడా అనుమతి ఇవ్వాలని జిల్లా మెజిస్ట్రేట్ కోర్ట్ నీ గతంలోనే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వటం జరిగింది.
ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలు అవుతూ ఉండగా మరో పక్క వారణాశి జిల్లా కోర్టులో వాదనలు గట్టిగా జరుగుతున్నాయి. ఈ మేరకు వారణాసి కోర్టు మే 26వ తారీకు గురువారం వాయిదా వేయడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే బ్రిటిష్ పరిపాలన కాలంలో 154 సంవత్సరాల క్రితం నాటి జ్ఞానవాపి ప్రాంగణం ఫోటో ఇప్పుడు బయటపడింది. ఫోటోలలో అనేక వాస్తవాలు వెలుగులోకి రావడం జరిగాయి.
బ్రిటిష్ ఫోటోగ్రాఫర్ శామ్యూల్ బోర్న్ అనే అతను జ్ఞానవాపి మసీదు ప్రాంగణం వద్ద 154 సంవత్సరాల క్రితం ఫోటోలు తీసినట్లు “దా మ్యూజియమ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్” హోస్టన్ అమెరికాలో బయటపడింది. తీసిన ఫోటో లో హిందూ దేవాలయానికి సంబంధించి.. పిల్లర్ లు.. మరియు గంటలు ప్రస్తుత జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
ఈ ఫోటో మ్యూజియాం గ్యాలరీలో నంది అదేవిధంగా ఆంజనేయస్వామి విగ్రహాలు మరికొన్ని దేవతా విగ్రహాలు అప్పట్లోనే వెలుగులోకి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో బ్రిటిష్ ఫోటోగ్రాఫర్ శామ్యూల్ బోర్న్ తీసిన ఫోటో..ఇప్పుడు మరింత వైరల్ గా మారింది. జ్ఞానవాపి మసీదుకి ముందే ఈ ప్రాంగణంలో హిందూ దేవాలయం ఉన్నట్లు వస్తున్న వార్తలకి మరింత బలం చేకూరింది.