జస్టిస్ ఎన్వీ రమణకు వ్యతిరేకంగా.. వైసీపీకి అనుకూలంగా సుప్రీంకోర్టులో ఓ పిల్ దాఖలైంది. ఈ పిటిషన్ వేసింది అనిల్ కుమార్ బోరుగడ్డ అనే వ్యక్తి పిటిషన్ వేశారు. అయితే.. అనిల్ పై గతంలో చాలా కేసులు ఉన్నాయి. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. వైసీపీలో 151 మంది ఎమ్మెల్యేలు, అనేక మంది వైసీపీ అభిమానులు, జగన్ ఫాలోవర్స్ ఉండగా ఇన్ని కేసులున్న వ్యక్తి పిటిషన్ వేయడంపై విమర్శలు వస్తున్నాయి. అనిల్ పై గతంలో మోసపూరితమైన, నేరాలు చేసారనే అభియోగాలు ఉన్నాయి. పిటిషన్ వేసినందుకు సంతోషించేలోపు పిటిషన్ వేసేందుకు మరెవరూ దొరకలేదా అనే ప్రశ్నలూ వస్తున్నాయి. దీంతో ఈ పిటిషన్ పై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎవరీ అనిల్ కుమార్ బోరుగడ్డ..
అనిల్ గుంటూరు నివాసి. కేంద్ర మంత్రి రామ్ నాధ్ అధవాలే స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకు ఏపీ వర్కింగ్ ప్రెసిడెంట్. నార్త్ లోనే పెద్దగా గుర్తింపు లేని పార్టీ. అనిల్ పై ఎన్నో అభియోగాలు, కేసులు ఉన్నాయి. మోసాలు, బెదిరింపులు, దందాలు, నకిలీ ఐడీ కార్డులతో అధికారులను మోసం చేయడం.. వంటి ఆరోపణలు కేసులు ఆయన మీద ఉన్నాయి. అమరావతి ప్రాంతంలో భూదందాలు చేస్తూ పోలీసులకు చిక్కాడు. గుంటూరులోని ఆరండల్ పేటలో ఆయనకు సైమన్స్ అమృత్ ఫౌండేషన్స్ అనే క్రిస్టియన్ సంస్థకు ఫౌండర్ కూడా. టీడీపీ హయాంలో చంద్రబాబుపై రమణ దీక్షితులు ఆరోపణలు చేసిన సమయంలో ఆయన పక్కనే ఉన్నాడు.
పార్టీ స్పందించకపోతే సీఎం జగన్ కే నష్టమా..
మంత్రి ఓఎస్డీ, ఐఏఎస్ ఆఫీసర్ నంటూ ఎన్నో వసూళ్లకు పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి. జగన్ పై కత్తి దాడి జరిగినప్పుడు కూడా హైకోర్టులో కేసు వేశాడు. ఇప్పుడు జస్టిస్ ఎన్వీ రమణపై సుప్రీంలో పిల్ వేశాడు. దీనికి సుప్రీంకోర్టు నుంచి అక్ నాలెడ్జ్ మెంట్ కూడా వచ్చింది. దీనిని తన ఫేస్ బుక్ లో కూడా పెట్టకున్నాడు. ఇలా ప్రచారానికి వాడుకుంటున్నాడు అని తెలిస్తే సుప్రీంకోర్టు ఆ వ్యాజ్యాన్ని క్యాన్సిల్ కూడా చేస్తుంది. ఇన్ని మోసాలు, ఆరోపణలు ఉన్న వ్యక్తి ఏపీ సీఎం కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే జగన్ పైనే మచ్చ రావడం ఖాయం. వైసీపీ అభిమానులు, పార్టీ నేతలు ఇదే చర్చించుకుంటున్నారు. ఈ విషయంలో పార్టీ ఆ పిల్ వెనక్కు తీసుకునేలా వ్యవహరిస్తే బాగుండును అని.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?