NewsOrbit
టాప్ స్టోరీస్ తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

YSRCP Vs KTR: కేటీఆర్ వెనుక పీకే..!? ఇది ఆ ముగ్గురి వ్యూహం..!? ఫైనల్ కామెడీ మిస్ అవ్వొద్దు..!

YSRCP Vs KTR: తెలంగాణ మంత్రి.. టీఆరెస్ కీలక నేత కేటీఆర్ వైసీపీ ప్రభుత్వంపై నిన్న ఒక దుమారాన్ని రేపారు.. బీభత్సంగా గాలి వీచి.. వాన కురిసి.. సాయంత్రానికి తీరం దాటినట్టుగా.. రాత్రి మళ్ళీ ఊరటనిచ్చే మరో ట్వీట్ చేశారు. ఒక దేహంపై దెబ్బ తగిలి.. దానికి మందుపూసినా ఆ దెబ్బ మచ్చ మాత్రం శాశ్వతంగానే ఉంటుంది.. సో.. కేటీఆర్ ఈ మాటల వెనుక ఒక ఉద్దేశం, ఒక ప్రణాళిక లేకుండా అయితే జరగదు.. అదేమిటనేది కొన్ని కోణాల్లో పరిశీలిస్తే..

“శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు”.. ఇది అందరికీ తెలిసిన సూత్రం. సేమ్ “ఒక రాజకీయ పార్టీతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) ఒప్పందం కుదుర్చుకుంటే ఆయన ఆజ్ఞ లేకుండా ఒక్క నాయకుడయినా ఒక్క మాట కూడా బయటకు మాట్లాడకూడదు. ఆయన ఎప్పుడు ఏమి చేయమంటే అది చేయాలి, ఎప్పుడు ఎక్కడ మీటింగ్ పెట్టమంటే అప్పుడు అక్కడ మీటింగ్ పెట్టాలి.. ఎలా ఉండమంటే అలా ఉండాలి.. ఏ డ్రెస్ వేసుకోమంటే ఆ డ్రెస్ వేసుకోవాలి..” పీకే వ్యూహాలు ఇలా ఉంటాయి. ఒకసారి ప్రశాంత్ కిషోర్, ఒప్పందం పెట్టుకుంటే ఆ పార్టీ నేత డ్రెస్ కోడ్ మొదలుకొని వేషధారణ వరకు ఆ ప్రాంతాన్ని బట్టి, ప్రజల ఆలోచన ను బట్టి డిసైడ్ చేస్తుండే వాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) మంత్రి కేటీఆర్.. ఏపీ సర్కార్ పనితీరు పై పరోక్షంగా చాలా ఖాటుగా విమర్శించారు. దీని వెనుక పీకే ఉండే ఉంటారు..!

YSRCP Vs KTR: గతంలో ఫ్రెండ్స్.. ఇప్పుడు చీకటి ఫ్రెండ్స్..!?

ఇదే కేటీఆర్, అయన తండ్రి సీఎం కెసిఆర్ లు 2019 ఎన్నికల్లో ఏపీలో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ అధికారంలోకి రావడానికి అనేక రకాలుగా సహకరించారు. ఈ విషయం రాజకీయ పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయితే తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్.. ఏపీ సర్కార్ పై చేసిన తీవ్ర వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. “పొరుగు రాష్ట్రంలో కరెంట్ లేదు. నీళ్లు లేవు. రోడ్లు అద్వాన్నంగా ఉన్నాయి అంటూ కామెంట్స్ చేసారు. తన స్నేహితుడు ఒకరు సంక్రాతి పండుగకు సొంత ఊరు వెళ్లి వచ్చిన తరువాత ఈ విషయాలు చెప్పాడని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాల నుండి ఊరికి నలుగురు చొప్పున జనాలను ప్రత్యేక బస్సుల్లో పొరుగు రాష్ట్రంకు పంపితే ఎంత దారుణ పరిస్థితులు ఉన్నాయో తెలుస్తాయి అని, తద్వారా తెలంగాణ సర్కార్ చేస్తున్న అభివృద్ధి అర్ధం అవుతుందని తన మిత్రుడు పేర్కొన్నారని” కేటీఆర్ వ్యాఖ్యనించారు. ఏపీ సర్కార్ ను ఇంత అవమానకరంగా కేటీఆర్ మాట్లాడితే.. దానికి ధీటైన విధంగా సమాధానం చెప్పాల్సిన ఏపీ మంత్రులు ఏదో తుతూ మంత్రంగా.. కేటీఆర్ వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలి, కేటీఆర్ ఆలా మాట్లాడటం సబబు కాదు అన్నట్లు కౌంటర్ ఇచ్చారు. సబ్జెక్టు తో సూటిగా ఒక్కరూ సమాధానం ఇవ్వలేదు. ఎందుకంటే.. ఇదంతా పీకే ప్లాన్ ప్రకారం జరుగుతోందనే అనుమానాలున్నాయి. ఇప్పటికే పీకే.. టీఆర్ఎస్ తో ఒప్పందం చేసుకున్నారు. ఆ క్రమంలోనే ఏపీ మంత్రులను రెచ్చ గోడితే రెండు రాష్ట్రాల మధ్య ప్రాంతీయ విభేదాలు వచ్చి తెలంగాణలో సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుంది అన్నది పీకే ప్లాన్ కావచ్చు అనేది విశ్లేషకుల వాదనలు!

గతంలో కూడా దుబ్బాక ఎన్నికల సమయంలో…!

దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో, జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలోనూ ఇదే విధంగా ప్రాంతీయ తత్వాన్ని రెచ్చ గొట్టేందుకు టీఆర్ఎస్ నీటి వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చింది. స్వయంగా కేసీఆర్ నీటి వివాదంపై మాట్లాడగా, మంత్రి నిరంజన్ రెడ్డి ఏకంగా వైఎస్ఆర్ ను నీటి దొంగ గా విమర్శించారు. ఎన్నికలు అయి పోయిన తరువాత ఏపీ ని విమర్శించడం మానుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికల వేడి రాజు కుంటున్న తరుణంలో మళ్ళీ సెంటిమెంట్ రాజేసేందుకు ఈ తరహా ప్లాన్ తీసుకుని వచ్చారు. దీని వల్ల ఏపీలో వైసీపీ కీ ఉప యోగం ఉంటుంది. రాష్ట్రం లో ఉన్న ఇష్యూస్ పక్క దారి పట్టి రాష్ట్రంలో చేసిన అభివృద్ధి చెప్పుకోవడానికి వైసీపీ కి అవకాశం ఏర్పడుతుంది. అటు తెలంగాణలో టీఆర్ఎస్ కి, ఇటు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ కి వ్యూహకర్త గా ఉన్న పీకే స్ట్రేటజీలో భాగమే కేటీఆర్ వ్యాఖ్యలు అని చెప్పవచ్చు. సో.. ఇవన్న్నీ అయిన తర్వాత సాఫీగా కేటీఆర్ మళ్ళీ రాత్రి ఒక ట్వీట్ చేసారు. “అదేదో ఫ్లోలో.. ఆ సమయంలో మాట్లాడేసాను. ఏపీ మంచి నాయకత్వంలో దూసుకెళ్తుంది” అని మసిపూసారు..!

ఫైనల్ కామెడీ మిస్ అవ్వొద్దు..!

ఈ తతంగంలో మొత్తంలో మంత్రి సీదిరి అప్పలరాజు కామెడీ మాత్రం మిస్ అవ్వకూడదు.. తెలంగాణ కంటే ఏపీనే అన్నివిధాలా అభివృద్ధి చెందింది అని చెప్పుకున్న మంత్రి.. “కరోనా సమయంలో దాదాపు 4 వేల మంది ట్రీట్మెంట్ కోసం తెలంగాణ నుండి ఏపీకి వచ్చారని బదులిచ్చారు.. కానీ వాస్తవాలేమిటో.. కరోనా సోకినా వెంటనే తెలంగాణలోని హైదరాబాద్ కి పోయి ట్రీట్మెంట్ చేయించుకున్న సహచర వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు” తెలియాలి..! అన్నీ తెలిసి మంత్రి చేసిన కామెంట్ కామెడీ కాకపోతే ఇంకేమిటి..!?

author avatar
Srinivas Manem

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju